ప్రస్తుత ఈ సమాజంలో ఆడవాళ్ల మధ్య గొడవలు అనేది సాధారణంగా జరుగుతుంటాయి. అయితే ఈ సారి మాత్రం ఇద్దరు యువతులు మెట్రోలో గొడవ పడటం అనేది ఢీల్లిలో చోటు చేసుకుంది..ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లే..
ప్రస్తుత ఈ సమాజంలో ఆడవాళ్ల మధ్య గొడవలు అనేది సాధారణంగా జరుగుతుంటాయి. అలా ఎక్కువగా అయితే వీధి కుళాయిల దగ్గర, సినిమా థియేటర్ల దగ్గర వద్ద.. ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా ఇంట్లో అయితే అత్తా కోడళ్లకు సంభందించి గొడవలను చూస్తూ ఉంటాం. కానీ.. ఇటీవలే మాత్రం బస్సులో సీటు కోసం, రైలులో సీటు కోసం కొట్టుకోవడం అనేది వింటూనే ఉన్నాం. అయితే ఈ సారి మాత్రం ఇద్దరు యువతులు మెట్రోలో గొడవ పడటం అనేది ఢీల్లిలో చోటు చేసుకుంది..ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లే..
ఢీల్లి లో ఎప్పటిలాగానే ప్రతిరోజు మెట్రో బయలుదేరింది..అక్కడ ఒ స్ఠాప్ దగ్గర మెట్రో ఆగింది. ఆగిన వెంటనే ఆ మెట్రోలో ఇద్దరు యువతులు ఎక్కారు. ఆ క్రమంలోనే ఓ సీటు విషయంలో వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ మెుదలైంది. ఆ చిన్న గొడవ కాస్త పెరిగి పెద్ద కొట్టుకునే స్థాయికి వెళ్లింది. అయితే సీటు నాది… ఆ సీటు నాది అంటూ కొంచెం సేపు ఆ యువతులు ఇద్దరు మెట్రో లోపల చెప్పులు, బాటిళ్లతో రెచ్చిపోయి కొట్టుకున్నారు. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఓ ప్రయాణికుడి తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. అయితే మెుదటగా మెట్రో ఎక్కిన ఇద్దరు యువతులు దూరంగా నిలబడి ఉన్నా కానీ.. ఆ ఇద్దరూ ఒకరినొకరు అసభ్యకరమైన మాటలతో దూషించుకున్నారు.
ఆ క్రమంలోనే ఎరుపు రంగు దుస్తులు ధరించిన యువతి మాత్రం తన షూ తీసి తనతో గొడవ పడుతున్ననల్ల దుస్తులు ధరించిన మహిళకు చూపించి బెదిరించింది. అలా బెదిరించినందుకు.. దానికి సమాధానంగా ఆ యువతి చేతిలో ఉన్నా బాటిల్ పట్టుకొని ఆమెకు ఎదురుగా వెళ్లి.. ఇంకా తీవ్రంగా గొడవకు దిగింది. ఈ క్రమంలోనే ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకోవద్దని.. అక్కడ ఉన్నా పరిస్థితిని చూసి ఆపే ప్రయత్నం చేసారు. అయినా వీరి పోరాటం మాత్రం ఆగలేదు.వీరి గొడవను చూసిన వాళ్లు ఇది బస్సు అనుకుంటున్నారా? బోరింగ్ వద్ద నీటి పంచాయితీ అనుకుంటున్నారా ? అంటూ తోటి వారు అంటున్నారు. ఈ ఘటన చూసిన చాలా మంది మగవాళ్లే నయం రా బాబు.. సీటైనా, సిగరేటైనా సమానంగా పంచుకుని సోదర భావంతో ఉంటారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..