కొన్ని సార్లు మనం తినే ఆహారమే ప్రమాదకరంగా మారి ప్రాణాలు హరించి వేస్తుంది. విషపూరిత పుట్టగొడుగుల ఆహారం తిని మరణించిన ఘటన అసోంలో చోటు చేసుకుంది. ఇప్పటికే పదిహేను మంది చనిపోగా మరో 40 మంది తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరగవొచ్చని వైద్యులు తెలిపారు. విషమంగా ఉన్నవారిని అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఎక్కువగా చనిపోయిన వారు తేయాకు కార్మికులే అని అధికారులు అంటున్నారు.
అసోంలో కొంత మంది తేయాకు కార్మికులు గత వారం రోజులుగా పుట్ట గొడుకును ఆహారంగా చేసుకొని తింటున్నారు. అయితే ఆ పుట్టగొడుగులు తినేవి అనుకొని వారు వంటలు చేసుకొని తిన్నారని.. కానీ అవి విషతుల్యమైనవని డా. ప్రశాంత దిహింగియా చెప్పారు. అడవిలో తిరుగుతున్న సమయంలో పుట్టగొడుగులు సేకరించి ఇంటికి తీసుకు వెల్లి వంట చేసుకొని తింటున్నారని.. వాటి ప్రభావం వల్ల వికారం, వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.