మౌనముని.. భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు చనిపోయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ ఆవుతోన్నాయి. కానీ.., ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. సాక్ష్యత్తు కొంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం నిజం తెలియక మన్మోహన్ సింగ్ చనిపోయినట్టు పోస్ట్ లు చేసి, మళ్ళీ వాటిని డిలీట్ చేశారు.
నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో మన్మోహన్ సింగ్ కొవిడ్-19 బారిన పడ్డారు. అదృష్టవశాత్తుగా ఆయన పూర్తి ఆరోగ్యంతో కోలుకుని ఇదే ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తరువాత ఆయన మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజుల క్రితం మన్మోహన్ సింగ్ కి డెంగ్యూ సోకినట్టు వైద్యులు తెలిపారు.
మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యుల బృందం స్పందిస్తూ.. ఆయనకు డెంగ్యూ నిర్ధారణ అయిందని.. వైద్య చికిత్స అందిస్తున్నట్లు నిర్ధారించారు. కాగా, ఎయిమ్స్ హాస్పిటల్లోని కార్డియో న్యూరో సెంటర్లోని ప్రైవేట్ వార్డులో మన్మోహన్ సింగ్ కి చికిత్స కొనసాగుతోంది. మరి.. మన్మోహన్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని.., కామెంట్స్ రూపంలో మీ విషెస్ అని అందించండి.