గతంలో పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన ఫాస్ట్ మూవీంగ్ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ ‘నెస్లే ఇండియా’తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. మతపరమైన అంశం జోలికి పోవడంతో సోషల్ మీడియాలో కంపెనీని నెటిజనులు దుమ్మెత్తి పోశారు. దీంతో క్షమాపణలు చెప్పిన కంపెనీ.. తన చర్యను వెనక్కి తీసుకుంది. చాక్లెట్ కవర్లపై పూరి జగన్నాథస్వామి, బలభద్ర, సుభద్రల చిత్రాలను కిట్కాట్ ముద్రించింది.
చాక్లెట్ కవర్లపై తాము ఆరాధించే దేవుళ్ల బొమ్మలు ముద్రించడమంటే తమ మత విశ్వాసాలను కించపరచడమేనంటూ సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మన ఒడిశా సంస్కృతి.. జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలను కిట్క్యాట్ చాక్లెట్పై చూడటం గర్వంగా ఉంది.. చాక్లెట్లను తిన్న తర్వాత దాని కవర్లను రోడ్లు, చెత్త బుట్టలు, మురికి కాలువల్లో పడేస్తారు.. చాలా మంది వాటిపై నుంచి నడుచుకుని వెళ్తారు’’ఓ నెటిజన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో నెటిజనల్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో నెస్లే కంపెనీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
It is a honor to see our Odisha culture & lord jagannath, balabhadra & subhadra on ##KitKat but plz think once, whn some1 will eat 🍫 & will throw the wrapper into dustbins, drains, gutters & many will walk on it 😭. Jagannath family will be happy with it. @CMO_Odisha @PMOIndia pic.twitter.com/10xPKsdz5c
— Sanjeeb Kumar Shaw (@sanjeebshaw1) January 16, 2022
ఇదిలా ఉంటే.. ‘‘ఒడిశా సంప్రదాయాన్ని ఇతర ప్రాంతాలకూ పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాం. కళను, కళాకారులను ప్రోత్సహించాలనే మా ఉద్దేశం. ఇదెంత సున్నితమైన అంశమో మేం అర్థం చేసుకోగలం. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే.. చింతిస్తున్నాం’’ అని నెస్లే ట్విటర్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు, ఆ చాక్లెట్ ప్యాక్లను తక్షణమే మార్కెట్ నుంచి వెనక్కి తెప్పించే చర్యలను ప్రారంభించామని పేర్కొంది.
किसने अधिकार दिया इन्हें कि ये kitkat के पैकेट पर भगवान जगन्नाथ जी का तस्वीर छापे
लोग चॉकलेट खाने के बाद पैकेट को या तो कूड़ेदान या रोड़ पर डालेंगे
ये हमारे भगवान का अपमान है और एक हिंदू होने के नाते ये हमें बर्दाश्त नहीं,
हिंदूओं विरोध करो इसका#Boycott_Kitkat#Boycott_Nestle pic.twitter.com/xHoBKxXz9l
— Suresh Choudhary (@SureshC71366729) January 17, 2022