దేశంలో పురావస్తు శాఖవారు జరిపే తవ్వకాల్లో ఎన్నో సొరంగ మార్గాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పురావస్తు తవ్వకాల్లో ప్రాచీన నాగరికతకు సంబంధించిన ఎన్నో వస్తువులు, చారిత్రక కట్టడాలు ఇతర విషయాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ భారీ సొరంగం బయటపడింది. దీనికి సంబంధించిన ఫోటోలో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు మార్గాన్ని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు.
అప్పట్లో మన దేశాన్ని బ్రిటీషర్లు పాలించిన సమయంలో ఆ మార్గం ద్వారా స్వాతంత్ర్య సమరయోధులను తరలించేటప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి బ్రిటిషర్లు దీనిని ఉపయోగించారని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ తెలిపారు. రెడ్ ఫోర్ట్కు అసెంబ్లీ నుంచి సొరంగ మార్గం ఉన్నట్లు చెప్పేవారని, దాని చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేశానని, కానీ క్లారిటీ రాలేదని రామ్ నివాస్ అన్నారు. అయితే, ఇప్పుడు ఆ టన్నెల్కు చెందిన ముఖ ప్రదేశాన్ని గుర్తించామన్నారు.
అయితే ఈ టన్నెల్ ను ఇప్పుడు ఉపయోగంలోకి తేవటం కుదరని పని, టన్నెల్ మార్గంలో మెట్రో పిల్లర్లు ఇతర నిర్మాణాలు వచ్చాయన్నారు. కొన్నేళ్ల క్రితం తవ్విన సొరంగం కావడంతో నిర్మాణాల కింద ఎక్కువ భాగం పూడిపోయి ఉండొచ్చని ఈ టన్నెల్ గురించి తెలిసిన వారు అనుకుంటున్నారు. అయితే, సొరంగ మార్గాన్ని పునరుద్ధరించి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. అన్ని కుదిరితే.. వచ్చే ఏడాది ఆగస్టు 15 లోపు 76 వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి సొరంగం పునరుద్ధరణ పనులు పూర్తవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ భారీ సొరంగానికి చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
A tunnel-like structure discovered at the Delhi Legislative Assembly. “It connects to the Red Fort. There is no clarity over its history, but it was used by Britishers to avoid reprisal while moving freedom fighters,” said Delhi Assembly Speaker Ram Niwas Goel (2.09) pic.twitter.com/OESlRYik69
— ANI (@ANI) September 2, 2021