ఆ ఆడబిడ్డని తల్లిదండ్రులు మహారాణిలా పెంచుకున్నారు. తమకి ఉన్నంతలో ఏ లోటు రాకుండా చూసుకున్నారు. పెళ్లి ఈడు వచ్చాక ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. కానీ.., ఆ పెళ్లి ఆమె పాలిట మరణ శాశనం అయ్యింది. అదనపు కట్నం అత్త ఇంటివారు అమాయకురాలైన కోడలిని 4 నెలల పాటు చిత్ర హింసలకు గురి చేశారు. దీంతో.. ఆ బాధ తట్టుకోలేకపోయిన కోడలు మౌనంగా ఉరి వేసుకుని కన్ను మూసింది. హృదయాలను కలచి వేసే ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలోని సంజయ్ కాలనీలో నైనా ఫ్యామిలీ నివాసం ఉంటోంది. నైనాకి పెళ్లి ఈడు రావడంతో.. ఆమెని అదే కాలనీకి చెందిన వల్లభ్ అనే యువకుడికి ఇచ్చి వివాహం జరిపించారు. అల్లుడికి కట్న కానుకలు కూడా బాగానే ఇచ్చారు. పెళ్లి అయిన కొత్తల్లో అత్తింటి వారు కూడా నైనా పై బాగానే ప్రేమ కురిపించారు. కానీ.., నెల తరువాత ఆమెకి అత్త ఇంటి వారి నుండి అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి.
నాకు ఓ స్థలం, ఓ రూ.50,000 అదనంగా కట్నం కావాలని భర్త వేధించడం మొదలు పెట్టాడు. అత్త, ఆడపడుచు అంతా నైనాని చిత్ర హింసలు చేశారు. ఇలా నాలుగు నెలలు పాటు నైనా అత్త ఇంటి వారి హింసని భరించింది. కానీ.., ఈ విషయాలు ఏవి తన తల్లితండ్రులకి తెలియకుండా జాగ్రత్త పడింది. కానీ.., వేధింపులు ఇంకా ఎక్కువ అవ్వడంతో తల్లిదండ్రులకి తాను భారం కాకూడదనుకుని నైనా ఉరి వేసుకుని చనిపోయింది. కానీ.., సూసైడ్ నోట్ లో అత్తింటి వారి అరాచకాలను మొత్తం రాసి చనిపోయింది. దీంతో.., అత్త ఇంటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి.. ఇలా కట్నం కోసం కోడలిని ఇబ్బంది పెట్టే అత్త ఇంటి వారికి ఎలాంటి శిక్ష విధించాలి? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.