టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడూ చాలా కూల్ గా ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మినహాయించి పెద్దగా బయటపడడు. కానీ ఒక్కసారి రియాక్ట్ అయితే పరిస్థితి మారిపోయింది. గతంలో ఒకట్రెండు మ్యాచ్ ల సందర్భంగా ధోనీ సీరియస్ కావడం మనం చూశాం. అప్పుడైతే ఏకంగా మైదానంలోకే వచ్చి అంపైర్లతో గొడవ పెట్టుకున్నాడు. ఇక ధోనీపై పలు విషయల్లో విమర్శలు వచ్చినప్పటికీ మహీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఏకంగా ఓ ఐపీఎస్ అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇక అసలు విషయానికొస్తే.. 2014లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ధోనీపై ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ అప్పట్లో షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ధోనీ మద్రాసు హైకోర్టుని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సంపత్.. మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ కి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకుండా శాశ్వతంగా నిలువరించాలని ధోనీ సివిల్ దావా వేశారు. ఫలితంగా 2014 మార్చి 18న ధోనీకి వ్యతిరేకంగా సంపత్ కుమార్ ఎలాంటి ప్రకటన చేయకూడదని కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులు ఉన్నప్పటికీ సంపత్ కుమార్.. సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
తనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసినందుకుగానూ అధికారితో పాటు జీ మీడియా కార్పొరేషన్ నుంచి రూ.100 కోట్ల నష్ట పరిహారం కోరుతూ ధోనీ పిటిషన్ వేశారు. సంపత్ కుమార్.. అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టుకు వ్యతిరేకంగా అపకీర్తి కలిగించే ప్రకటనలు చేశారని ధోనీ తన పిటిషన్ లో పేర్కొన్నాడు. ఇక జస్టిస్ పీఎన్ ప్రకాష్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ముందుకు ఈ కేసు విచారణకు వచ్చింది. కానీ శుక్రవారం ఇది జరగలేదు. ఇదిలా ఉంటే మంగళారం.. ధోనీ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ధోనీ-సంపత్ కుమార్ ల మధ్య వివాదంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
MS Dhoni! pic.twitter.com/u2mi9QXzt0
— RVCJ Media (@RVCJ_FB) November 5, 2022
Former Indian skipper MS Dhoni files contempt of court plea against IPS officer in Madras HC
Read @ANI Story | https://t.co/oYr26bLRQ9#MSDhoni #ContemptofCourt #IPLBetting pic.twitter.com/zheQIACAo6
— ANI Digital (@ani_digital) November 5, 2022