దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఎవరి ప్రాణాలు ఎప్పుడు గాలిలో కలసి పోతాయో అర్ధం కాని పరిస్థితి. ఇక దీనికి తోడు దేశంలో నామ మాత్రంగా ఉన్న వైద్య రంగంలో చేతులు ఎత్తేసిన పరిస్థితి. 100లో కనీసం 10 మందికి కూడా బెడ్స్, ఆక్సిజన్ దొరకని పరిస్థితి. ఇలాంటి స్థితిలో ప్రాణాలను నిలిపే ఏ చిన్న అవకాశం ఉన్నా జనాలను దానిని వదులుకోవడం లేదు. నెల్లూరు జిల్లా.. ముత్తుకూరు మండలం.. కృష్ణ పట్నంలో ఉచితంగా ఇస్తున్న కరోనా ఆయుర్వేద మందు ప్రస్తుతం ప్రజలకి ఇలాంటి భరోసానే ఇస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా ఇప్పుడు ఈ ఆయుర్వేద ముందుకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతోన్నాయి. అసలు ఇంతకీ ఈ మందు ప్రత్యేకత ఏమిటి? శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులకి సైతం అంతుపట్టని చైనా వైరస్ ఈ ఆయుర్వేద ముందుకి ఎలా తలొగ్గుతోంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నెల్లూరు జిల్లా ఆయుర్వేద మందు వాడితో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా ఏ స్థాయిలో ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్ రావడం, పాజిటివ్ వచ్చినప్పుడు సీటి స్కాన్ లో చెస్ట్ సివియారిటీ స్కోర్ 24/25 ఉన్నా.., ఈ మందు వాడిన తరువాత కేవలం రెండు రోజుల్లోనే నార్మల్ రిపోర్ట్స్ రావడం, ఆక్సిజన్ అందక తీవ్ర విషమ పరిస్థితుల్లో ఉన్న వారు కూడా ఒక్కరోజులో లేచి కూర్చోవడం వంటి అద్భుతాలు ప్రజల కళ్ళ ముందే జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో గత మూడు రోజులుగా ఈ విషయం వైరల్ అయ్యింది. దీంతో.., కేరళ, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టి ఒక్కసారి గా నెల్లూరు జిలాల్లోని కృష్ణపట్నం పైకి మళ్ళింది.కార్పొరేట్ ఆసుపత్రులు చేతులెత్తేసిన కేసులు కూడా రెండు రోజుల్లోనే తగ్గిపోవడం, ఇంత వరకు ఈ వైద్యం పై ఒక్క రిమార్క్ కూడా రాకపోవడంతో వేలాది మంది కృష్ణ పట్నానికి క్యూ కట్టడానికి ప్రధాన కారణం. 25 లక్షలు ఖర్చు చేసినా ఏ మాత్రం గ్యారంటీ ఇవ్వని కార్పొరేట్ ఆసుపత్రులు కంటే ఒక్క పైసా తీసుకోకుండా రెండు రోజుల్లోనే నెగెటివ్ తెప్పిస్తామని భరోసా ఇస్తున్న ఆయుర్వేద వైద్యులు కాస్తయినా నయమే కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కృష్ణపట్నం గ్రామంలో బొణిగి ఆనందయ్య ఓ మాజీ సర్పంచ్. ఆయన తన మిత్రులతో కలిసి కరోనా నివారణకు ఈ ఆయుర్వేద వైద్యం అందిస్తున్నారు. గొలగమూడి వెంకయ్యస్వామి భక్తుడైన ఆనందయ్యకు తమిళనాడు ఆయుర్వేద డాక్టర్ ఒకరు పోయిన సంవత్సరం గొలగమూడిలో పరిచయమయ్యారట. ఆయన కొన్ని మూలికల మిశ్రమంతో కరోనా కట్టడి అవుతుందని ఆనందయ్యకు చెప్పారట. గతేడాది కరోనా బారిన పడిన ఆనందయ్య మొదట ఆ మూలికా వైద్యాన్ని తన మీదే ప్రయోగించి కరోనా నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత తన బంధువులకు కూడా ఈ వైద్యం సత్ఫలితం ఇవ్వడంతో ఈ ఏడాది ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు. బొణిగి ఆనందయ్య, తన మిత్రులతో అందిస్తున్న ఈ ఆయుర్వేద మందుకు సంబంధించి ఒక్క పైసా కూడా డబ్బులు తీసుకోకుండా ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో అందిస్తుండటం విశేషం. ఆనందయ్య అందిస్తున్న మందు వినియోగించిన వారిలో ఇప్పటివరకు సత్ఫలితాలు తప్ప.., ఎక్కడా దుష్ప్రభావం చూపలేదు. కానీ.., ఈ ముందుకి ఇప్పటి వరకు శాస్త్రీయత లేదు. దీంతో.., ఆనందయ్య అందిస్తున్న మందు గురించి లోకాయుక్త జిల్లా అధికారులను వివరణ కోరింది. దీనితో ఆనందయ్య అందిస్తున్న మందు గురించి రిపోర్ట్ ఇవ్వడానికి అధికారులు గడువు కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ఆయుష్ మరియు ఇతర అధికారులు కృష్ణపట్నంచేరుకొని విచారణచేపట్టారు. ప్రజలనుంచి అనుకూల స్పందన వస్తున్నా.., జనం భౌతిక దూరం పాటించకుండా రద్దీగా గుమికూడడంతో అధికారులు మందు సరఫరాను తాత్కాలికంగా నిలిపి వేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి అధికారులు ఈ మందు ముడి సరుకుల వివరాలను సేకరించి పరీక్షల నిర్వహణకు ల్యాబ్ కు తరలించారు. చూడాలి మరి.. ఒకవేళ ఈ ఆయుర్వేద మందు శాస్త్రీయంగా నిరూపణ అయితే.. కరోనా నివారణలో ఓ మంచి అడుగు ముందుకి పడినట్టే. మరి.., ఈ నెల్లూరు ఆయుర్వేద మందుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.