ఆరేళ్ళ క్రితం విడుదలైన దృశ్యం మూవీ తెలుగులో ఎంత ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ద్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ.. ఫ్యామిలీ ఆడియన్స్ ని సైతం కట్టి పడేసింది. ముఖ్యంగా.. ఇందులో రాంబాబు పాత్రలో విక్టరీ వెంకటేశ్ నటన అద్భుతం అని చెప్పుకోవాలి. ఒక సాధారణ కేబుల్ ఆపరేటర్ కుటుంబంలో అనుకుకోకుండా జరిగిన ఘటన.. వారి జీవితాలను ఎలా మార్చేసింది అనేది ఈ చిత్ర కథ. అయితే.., ఇన్నాళ్ల తరువాత దృశ్యం కి సీక్వెల్ గా దృశ్యం-2 ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమైంది.
మళయాలంలో ఇప్పటికే విడుదలైన దృశ్యం-2 అక్కడ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా.. ఇప్పుడు మేకర్స్ దృశ్యం-2తెలుగు టీజర్ ని విడుదల చేశారు. మొత్తం నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ లో రాంబాబు జీవితంలో మారిన పరిస్థితులను హైలెట్ చేశారు. ఇక దృశ్యంలోలానే దృశ్యం -2లో కూడా మర్డర్ మిస్టరీ పైనే కథ నడవబోతుందని టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. ఇక స్టార్ కాస్ట్ కూడా మారకపోవడం, ఒరిజినల్ ని తెరకెక్కించిన జీతు జోసెఫ్ దృశ్యం-2 ని డైరెక్ట్ చేయడంతో మూవీలో ఫీల్ ఎక్కడా మిస్ కాలేదని టీజర్ చెప్పకనే చెప్తుంది. కాగా.. దృశ్యం 2 చిత్రం హక్కులను ప్రైమ్ సొంతం చేసుకోవడం. నవంబర్ 25 నుండి దృశ్యం 2 అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. మరి.. దృశ్యం-2 విక్టరీ వెంకటేశ్ కి ఎలాంటి విజయాన్ని కట్టబెడుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.