తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ గారాల పట్టి వరలక్ష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట హీరోయిన్ గా అరంగేట్రం చేసినప్పటికి, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే మంచి పేరు సంపాదించుకుంది. ధైర్యం ,సాహసం, సాయం, సేవ వంటి గుణాలు కలిగిన అతి తక్కువ మంది నటీనటుల్లో వరలక్ష్మి ఒకరు. ఇటీవలే తెలుగులో క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అదరగొట్టేసింది. ఇలా పెర్ఫార్మెన్స్ ఓరియంటేడ్ పాత్రలతో తెలుగు, తమిళ పరిశ్రమలో దూసుకెళ్తుంది. ప్రస్తుతం పలు సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉండే వరలక్ష్మి.. కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమాలను ఎదుర్కొందంట. నటిగా దశాబ్ద కాలాన్ని ఎంతో విజయవంతంగా ఆమె పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
‘పోడా పోడి’ అనే తమిళ సినిమాతో కథనాయకిగా సినీ ఇండస్ట్రీలోకి వరలక్ష్మి ఎంట్రి ఇచ్చారు. ఆ తరువాత మాణిక్య అనే కన్నడ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాందించి. అనంతరం అనేక సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తమిళ్ నుంచి డబ్ అయినా సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే తెనాలి రామకృష్ణ మూవీతో తెలుగులో నేరుగా ఎంట్రీ ఇచ్చింది. అందులో ఆమె చూపించిన విలన్ ఇజానికి మంచి మార్కులు పడ్డాయి. అనంతరం క్రాక్, నాంది వంటి సినిమాలో అదిరిపోయే నటనతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇలా శరత్ కుమారు వారసులురాలిగా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి స్వశక్తితో ఎదిగారు.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు. 2012 లో పోడాపోడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి.. ఆ తరువాత అనేక సినిమాలో నటించి.. దశాబ్ద కాలాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ పదేళ్ల తన సినీ కెరీర్ అంత సులభంగా సాగలేదని, ప్రారంభంలో ఎన్నో అమానాలు పడ్డానని తెలిపింది. అంతే కాక మరెన్నో తిరస్కారాలకు గురయ్యానని, బొద్దుగా ఉన్నావు, ఫేస్ లో ఆకర్షణ లేదు అంటూ ఎన్నో అవమానాలకు గురి చేశారని వరలక్ష్మి తెలిపారు. అయితే ఇలాంటివి ఏమి తనను ఆపలేదని, వాటి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని అన్నారు. ” పదేళ్లలో నేను 45 చిత్రాల్లో నటించాను.
అంతే కాక ఈ పదేళ్ల కాలంలో నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేసుకుంటూ వస్తున్నాను. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ లో ప్రేక్షకులు నన్ను బాగా ఆదరించారు. ఇంకా చెప్పాలంటే విలనిజాన్ని ప్రదర్శించడం చాలా కష్టం. అలాంటి కష్టమైన పాత్రలో నటించగలనని నిరూపించాను. ఇన్నేళ్ల నాసినీ ప్రయాణం తిరిగి చూస్తే మంచి అనుభూతికి లోనవుతున్నాను. నాలోని నటనను చాటుకునే విధంగా పలు అవకాశాలు వస్తున్నాయి. విరామం లేకుండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాను. ప్రస్తుతం నేను నా కెరీర్ తో చాలా సంతోషంగా ఉన్నాను” అని వరలక్ష్మి శరత్ తెలిపారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.