తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్వయం కృషితో ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానాన్నిఆక్రమించుకున్నాడు. ఇక మెగా కుటుంబం నుంచి సుమారు ఏడు ఎనిమిది మంది హీరోల దాక వెండి తెరకు పరిచయం అయ్యారు. ఈ క్రమంలోనే ”ఉప్పెన” మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు హీరో వైష్ణవ్ తేజ్. తన తొలి సినిమా తోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా అలీ తో సరదగా ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
వైష్టవ్ తేజ్.. చిరంజీవి నటించిన శంకర్ దాదా MBBS చిత్రం ద్వారా బాల నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. తర్వాత క్రిష్ దర్శకత్వంలో కొండపొలం చేశాడు. తాజాగా వైష్టవ్ నటించిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా డైరెక్టర్ గిరీశయ్యాతో కలిసి అలీతో సరదాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా అలీ.. ‘చిరంజీవితో కలిసి నటించావ్ కదా ఆయన ఏమైనా సలహాలు ఇచ్చారా? అని అడగ్గా.. ‘శంకర్ దాదా MBBSలో నాది చిన్నపాత్ర. అదీ కాక ఆ పాత్రలో నేను అస్సలు కదలకూడదు. కళ్లు ఆర్పకూడదు. ఒక సారి ఆ సీన్ లో బాగ నవ్వే సరికి కోపం తెచ్చుకున్నారు’. అని వైష్ణవ్ సమాధానం చెప్పాడు. ఇక అలీ.. మీ కుటుంబ వేడుకల్లో తేజ్ అని పిలిస్తే ఎంత మంది వెనక్కి తిరుగుతారు? అని ప్రశ్నించగా.. చిరు మామయ్య ఓరేయ్ అంటే చాలు అందరం భయంతో వెంటనే ఆయన వైపు చూస్తాం అంటూనే ఉప్పెన కథను చిరంజీవి మామయ్యే విని బాగుంది చెయ్ అన్నాడు. అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక రొమాంటిక్ పాటలలో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డానని తెలిపాడు. ఉప్పెన మూవీలో ఓ సీన్ కు ఏకంగా 20 టేక్ లు తీసుకున్నట్లు చెప్తూ బాధపడ్డాడు. అదీ కాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు, బద్రి మూవీలను దాదాపు 120 సార్లు చూసి ఉండోచ్చని తెలిపాడు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ శ్రీలీల హీరోయిన్ గా ఓ భారీ మాస్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీని సితారా ఎంటర్టైన్ మెంట్, ఫార్చ్యూన్ ఫొర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి హీరో వైష్ణవ్ తేజ్ పంచుకున్న విశేషాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.