సినిమా నటులు విలాసవంతమైన జీవితాలు గడుపుతారనుకుంటారు ప్రేక్షకులు. అయితే తెరపై ఎంతో సంతోషంగా, హుషారుగా నటించినప్పటికీ.. కొందరి జీవితాల్లో విషాదాలు దాగి ఉంటాయి అని చాలా మందికి తెలియకపోవచ్చు. అలాంటి విషాదాలే తన జీవితంలో ఉన్నాయి అంటున్నారు ఓ సీనియర్ నటి.
సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ లు అందరు ఏదో ఒక సమయంలో తెరమరుగు అవ్వక తప్పదు. అయితే కొంత మంది అవకాశాలు రాక ఇండస్ట్రీ వదిలేస్తే.. మరికొందరేమో కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే పలు కారణాలతో పరిశ్రమకు దూరమవుతుంటారు. అలా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఓ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది ఓ సీనియర్ నటి. అయితే పెళ్లైన కొంత కాలానికే భర్త చనిపోవడంతో తన జీవితం తలకిందులు అయ్యిందని చెప్పుకొచ్చింది ఆమె.
సినిమా నటులు విలాసవంతమైన జీవితాలు గడుపుతారనుకుంటారు ప్రేక్షకులు. అయితే తెరపై ఎంతో సంతోషంగా, హుషారుగా నటించినప్పటికీ.. కొందరి జీవితాల్లో విషాదాలు దాగి ఉంటాయి అని చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ క్రమంలోనే ఓ సీనియర్ నటి తన జీవితంలో ఉన్న కన్నీటి కష్టాలను తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ సీనియర్ నటిపేరు రాజశ్రీ. ఎన్టీఆర్, ఏఎన్నార్, కాంతారావు లాంటి సీనియర్ హీరోల సరసన నటించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది రాజశ్రీ. అయితే కెరీర్ ఫుల్ బిజీగా ఉండగానే.. ఆమెకు పెళ్లి జరిగింది.
ఈ క్రమంలోనే హైదరాబాద్ కు చెందిన ఓ పోలిటికల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని ఆమె పెళ్లాడింది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీ వైపు చూడలేదని రాజశ్రీ తెలిపింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న కఠిన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు. “రాజకీయ కుటుంబానికి కొడలిగా వెల్లడంతో నన్ను అందరు అదృష్టవంతురాలు అని అన్నారు. కానీ కొంతకాలానికి నా భర్త చనిపోవడంతో.. ఒక్కసారిగా నా జీవితం తలకిందులైపోయింది. ఈ ఇన్సిడెంట్ తో 10 సంవత్సరాలు నేను బయటకి రాలేదు. బయటి ప్రపంచానికి నా ముఖం చూపించకుండా బతికాను” అంటూ తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాను గుర్తుచేసుకుని బాధపడింది రాజశ్రీ. ప్రస్తుతం తన మనవళ్లతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను అని, తన కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడని ఆమె చెప్పుకొచ్చింది.