సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జోడిగా గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారిపాట.ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం మే12న విడుదల కానుంది. ఈ క్రమంలో RRR,KGF-2 చిత్రాల మాదిరే ‘సర్కారు వారి పాట’ సినిమా టికెట్ ధరలు కొంత మేర పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సర్కారు వారి పాట టీమ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండీ: Poonam Kaur: పూనమ్ కౌర్కు పెళ్లై, ఇద్దరు పిల్లలు అంటూ వార్తలు! క్లారిటీ ఇచ్చిన పూనమ్!
మే 12న విడుదల కానున్న సర్కారు వారి పాట సినిమా టిక్కెట్ ధరలకు సంబంధించి ఓ వార్త వినిపిస్తోంది. సినిమా టికెట్ ధరలు పెరిగినట్లు సమాచారం. అయితే గత సినిమాల అంత స్థాయిలో మాత్రం పెరగనట్లు సమాచారం. తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్లో టికెట్ ధర రూ.212.4, మల్టీప్లెక్స్ లో అయితే రూ.354. అదే విధంగా ఏపీలోని అన్ని పట్టణాల్లో సినిమా టికెట్ ధరలు రూ.206.5 నుంచి రూ.236 మధ్య ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లతోనే ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల పాజిటివ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఎందుకంటే సినిమా బాగుంటే రిపీటెడ్ ఆడియన్స్ ఉండే అవకాశం ఉందనే భావనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రోజుకు ఎన్ని షోలు అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#SarkaruVaariPaata Planned Pricing in Telugu States (Regular Seats) Subject to pending approvals.
Telangana Single Screens ₹212.4 & Plexes ₹354!
AP (Cities) ₹206.5 & ₹236!
(Same as #Acharya) pic.twitter.com/eYy67V3hh7
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) May 5, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.