తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయింది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే అని అందరూ అనుకునేవారు. కానీ ‘బాహుబలి’తో వండర్ క్రియేట్ చేసిన రాజమౌళి.. టాలీవుడ్ సత్తా ఏంటో ప్రపంచానికి పరిచయం చేశారు. తమని చిన్నచూపి చూసిన వారితోనే శెభాష్ అనిపించారు. ఇక ‘బాహుబలి’ రెండు పార్ట్స్ తర్వాత రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’.. విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. రీసెంట్ గానే ‘జపాన్’లోనూ రిలీజై అక్కడ కూడా కలెక్షన్లతో అదరగొట్టింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘బాహుబలి’ని రెండు భాగాలుగా తీసిన రాజమౌళి టాలీవుడ్ లో వండర్స్ క్రియేట్ చేశాడు. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నే మార్చేశాడు. దీంతో జక్కన్నని స్పూర్తిగా తీసుకుని మిగతా స్టార్ డైరెక్టర్స్ కూడా సీక్వెల్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్ కూడా ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్ కి సిద్ధమవుతున్నారు. అయితే ఈ ఏడాది మార్చిలో రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసింది.
ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత దీనికి కూడా సీక్వెల్ తీస్తే బాగుంటుందనే అభిప్రాయాలు చాలా వ్యక్తమయ్యాయి. కానీ రాజమౌళి దీని గురించి ఎక్కడా నోరు విప్పలేదు. ఇక తన తర్వాతి సినిమా మహేశ్ బాబుతో తీయనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అయితే ఆ సినిమా కంటే ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ గురించి అసలు విషయం బయటపెట్టాడు. చికాగోలో జరిగిన ఓ మీటింగ్ లో మాట్లాడుతూ.. ‘ఇప్పుడే ఏం విషయాలు రివీల్ చేయదలుచుకోలేదు. కానీ నేను, మా నాన్న.. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి డిస్కస్ చేశాం. ఆయన(విజయేంద్రప్రసాద్).. స్టోరీ మీద వర్క్ చేస్తున్నారు’ అని మెగా, నందమూరి అభిమానులకు అదిరిపోయే వార్త చెప్పాడు. అయితే ఈ సినిమా SSMB29 ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే ఉండొచ్చు. అంటే మరో నాలుగైదేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రావొచ్చు. మరి ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ కోసం మీలో ఎంతమంది వెయిటింగ్? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
We had discussions, and my father (writer for RRR) working on the ideas.
~ @ssrajamouli on Sequel to the #RRR 🌊🔥pic.twitter.com/zFMcSX2riS
— 𝐍𝐓𝐑 𝐓𝐡𝐞 𝐒𝐭𝐚𝐥𝐰𝐚𝐫𝐭 (@NTRTheStalwart) November 13, 2022