ఒకప్పుడు మన దేశంలో మూవీ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ గురించి, హిందీ సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడేవారు. కానీ గత కొన్నేళ్లలో సీన్ పూర్తిగా మారిపోయింది. దక్షిణాది సినిమాలు.. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలు పాన్ ఇండియా వైడ్ ప్రభంజనం సృష్టిస్తున్నాయి. వందల వేలకోట్ల వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. మరోవైపు బాయ్ కాట్ ట్రెండ్, సినిమాల్లో కంటెంట్ సరిగా లేకపోవడంతో హిందీ చిత్రాలన్నీ బొక్కబోర్లా పడుతున్నాయి. దీంతో ఆ హీరోలందరూ టాలీవుడ్ మార్కెట్ పై దృష్టిపెట్టారు. రీసెంట్ గా ‘లాల్ సింగ్ చడ్డా’తో ఆమిర్ ఖాన్ మన ముందుకి రాగా.. ఇప్పుడు రణ్ బీర్ కపూర్ ‘బ్రహ్మాస్తం’ సినిమా సెప్టెంబరు 9న ఇక్కడ కూడా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే హీరోహీరోయిన్ రణ్ బీర్-ఆలియా.. తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యేందుకు తెగ కష్టపడుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లో శుక్రవారం… ‘బ్రహ్మాస్త్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ లెవల్లో జరగాలి. కాని అనుకోని కారణాల వల్ల దాన్ని రద్దు చేశారు. బదులుగా పార్క్ హయాత్ లో ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో ‘బ్రహ్మాస్త్రం’ టీమ్ తో పాటు డైరెక్టర్ రాజమౌళి-ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆలియా భట్.. ‘కుంకుమలా’ పాట పాడి ఇంప్రెస్ చేయగా, రాజమౌళి రాసిచ్చిన తెలుగు మాటలని ముద్దు ముద్దుగా మాట్లాడి రణ్ బీర్ కపూర్ కూడా ఇంప్రెస్ చేశాడు. ఓ విధంగా హీరోహీరోయిన్ ఇద్దరు కూడా.. తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు.
కాగా మరో ‘బాహుబలి’ని చేయాలనే ఉద్దేశంతో ‘బ్రహ్మాస్త్రం’ మూవీ సౌత్ లో తెగ ప్రమోట్ చేస్తున్నారు. తెలుగు వరకు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆడియెన్స్ లో కొంతమేర అంచనాలు ఉన్నాయి. మరి ‘బ్రహ్మాస్తం’ మూవీ ఫలితం గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్ను ఏకిపారేస్తున్న నెటిజన్లు.. గుడిలోకి చెప్పులేసుకుని వెళ్తారా.. బాయ్కాట్ బ్రహ్మస్త్ర!