తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఆక్టీవ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. తను చేసే పోస్టులు వివాదాస్పదంగా ఉండడంతో క్షణాల్లో వైరల్ గా మారుతాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాయాజాలం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు. ఆ తర్వాత తెలుగు తో పాటు తమిళ్ సినిమాల్లో నటించి మెప్పించింది. కాగా పూనమ్ పలు సినిమాల్లో నటించినప్పటికి స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది. సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గడంతో నటన నుంచి దూరమైంది. సినిమా అవకాశాలు లేకపోయినప్పటికి సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటూ పలు విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖుల గురించి వివాదాస్పద విషయాలను వెల్లడిస్తూ సంచలనంగా మారుతుంది. ఈ సందర్భంగా ఈ రోజు గురుపౌర్ణమిని పురస్కరించుకొని తన ఇన్ స్టా స్టోరీ నెటిజన్స్ తో పంచుకుంది. అది కాస్తా వైరల్ గా మారింది. ఇంతకీ ఆ స్టోరీలో ఏముందంటే..
నటి పూనమ్ కౌర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆక్టీవ్ గా ఉంటూ తన ఫోటోలను, తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తను చేసే పలు పోస్టులు వివాదాస్పదంగా మారి చర్చకు దారితీస్తాయి. ఏదైనా ఘటనా చోటు చేసుకుంటే దానిపై వెంటనే స్పందిస్తూ దానిపై చర్చకు దారితీసే విధంగా వ్యవహరిస్తుంది. సినీ రంగంలో చోటు చేసుకునే ఘటనల నుంచి, రాజకీయం వరకు ఏ ఘటన చోటుచేసుకున్నా ట్వీట్లు చేస్తూ సంచలనంగా మారుతుంది. ఈమె పోస్టులు సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ గా మారుతాయి. కాగా ఈ రోజు పూనమ్ కౌర్ ఇన్ స్టాలో ఓ స్టోరీ పోస్ట్ చేసింది. ఆ స్టోరీలో ఈ విధంగా రాసుకొచ్చింది. ‘ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను. గురువును టామ్, డిక్ అని పిలవద్దని. నీతులు చెప్పి స్టేజ్ మీద జీవితాలతో ఆడుకునేవాడు గురువు కాదు. మీకు దారి చూపించేవారు గురువు అవుతారు అని రాసుకొచ్చింది. దీంతో ఈ బ్యూటీ ఇన్స్టా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇక ఈ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.