ఈ మధ్యకాలంలో మందు కొట్టడం అనేది సాధారణం అయిపోయింది. బాధ కలిగినా, సంతోషం కలిగినా మందు తో సెలబ్రేట్ చేసుకోవడానికే మొగ్గుచూపుతున్నారు. ఈ విషయంలో సాధారణ జనంతో పాటు సెలబ్రిటీలు కూడా మద్యం మత్తులో తూగుతున్నారు.
ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే హీరోలు, సినీ ప్రముఖులు ఒకప్పుడు రహస్యంగా మధ్యం సేవించేవారు. కానీ ఇప్పుడు మరిస్థితులు పూర్తి విరుద్దంగా మారిపోయాయి. బహిరంగంగానే మధ్యం సేవిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. ఇక మందు కొట్టే వారి జాబితాలో హీరోలే కాకుండా హీరోయిన్లు కూడా వచ్చి చేరారు. ఈ క్రమంలో ఓ స్టార్ హీరోయిన్ తాను మందు తాగుతానని, మధ్యానికి బానిసనయ్యానంటూ చెప్పుకొచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
బాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత అయిన మహేష్ భట్ కూతురు పూజా భట్ తాను మధ్యానికి బానిసైనట్లు తెలిపింది. ఈమె బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. పలు సినిమాలకు దర్వకత్వం వహించింది. తండ్రి మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన డాడీ సినిమాలో తొలిసారిగా నటించి మెప్పించింది. తాజాగా హిందీ బిగ్ బాస్ ఒటిటి2 సీజన్ లో పాల్గొన్న ఆమె పలు సంచలన విషయాలను వెళ్లడించింది. తనకున్న చెడ్డ అలవాట్ల గురించి చెబుతూ తాను మధ్యం తాగుతానని, ఆ అలవాటు రాను రాను వ్యసనంగా మారిందని తెలిపింది. అయితే తన 44వ ఏట మధ్యపాన అలవాటును వదిలించుకున్నానని చెప్పింది.
సమాజంలో ఆడవాళ్లు మధ్యం తాగుతున్నారంటే ఎంత లోకువగా చూస్తుందో వేరే చెప్పక్కర్లేదు. అదే మగవాళ్ల విషయానికి వస్తే.. వారు మధ్యానికి బానిసై ఆ అలవాటును వదిలేస్తే ప్రశంసిస్తారు. అదే మహిళలు మధ్యం తాగుతామని బయటికి చెప్పలేరు. కానీ తాను మాత్రం అందరి ముందే మందు తాగేదానిని అని, ఆ వ్యసనం నుంచి బయటికి వచ్చేటప్పుడు అందరికీ ఎందుకు చెప్పకూడదని అనిపించిందని పూజా భట్ తెలిపింది. అప్పటికే అందరు తనకున్న అలవాటుతో తాగుబోతు అని పిలిచేవారని, కానీ నేను మానేశాను అని చెప్పానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి మహానటిగా పేరుగాంచిన సావిత్రి మధ్యానికి బానిసై తన కెరీర్ ను, జీవితాన్ని అర్థాంతరంగా ముగించిన విషయం తెలిసిందే.