పవన్ కళ్యాణ్ హీరోగా దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయ్యప్పణం కోషియం అనే సినిమాకు రీమేక్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇందులో పవన్ బీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.
ఇక తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ను ప్రకటించింది చిత్ర యూనిట్. పవన్ కళ్యాణ్ లుంగీ కట్టుకుని నడిచొస్తున్న ఫోటోను జత చేస్తూ కొన్ని కీలక అప్డేట్ ప్రకటించారు. ఆగస్ట్ 15న 9:45 నిమిషాలకు ఈ మూవీ టైటిల్తో పాటు ఫస్ట్ గ్లిమ్స్ను కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు యూనిట్. ఇక ఈ మూవీలో పవన్ సరసన హీరోయిన్గా నిత్యా మీనన్ను నటిస్తోందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పాత్ర కూడా ఉండనుంది. ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.