ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా సరే వాళ్లకూ ఓ పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఎప్పుడూ సినిమాలే కాకుండా అప్పడప్పుడు ఫ్యామిలీతో కలిసి టూర్స్ కూడా వేస్తుంటారు. టాలీవుడ్ స్టార్ హీరోలందరూ కూడా ఆల్మోస్ట్ ఇదే ఫాలో అవుతుంటారు. ఇక ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి, వరల్డ్ వైడ్ సెన్సేషన్ అయిపోయిన ఎన్టీఆర్.. ఇంకా రిలాక్స్ మోడ్ లోనే ఉన్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి యూఎస్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. జూనియర్ ఎన్టీఆర్ ఎంతపెద్ద స్టార్ హీరో అయినా సరే ఫ్రెండ్స్ దగ్గరకొచ్చేసరికి పిల్లాడిలా మారిపోతాడు. సెలబ్రిటీ అనే ఆలోచనే లేకుండా వాళ్లతో కలిసిపోతాడు. ఇది చాలాసార్లు జరిగింది. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ గ్యాప్ లోనూ తారక్ ఎంత అల్లరి చేశాడో స్వయంగా డైరెక్టర్ రాజమౌళినే చాలాసార్లు చెప్పుకొచ్చాడు. కొన్నిరోజులు ముందు కూడా ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్, జపాన్ వెళ్లివచ్చాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివతో కలిసి పనిచేయాల్సి ఉంది. కానీ స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేస్తుండటం వల్ల ప్రాజెక్ట్ లేటవుతుందని మాట్లాడుకుంటున్నారు.
ఇక ఎప్పుడో గానీ ఎన్టీఆర్ కు ఇంత ఫ్రీ టైం దొరకదు. అందుకే భార్య పిల్లలతో కలిసి టూర్స్ వెళ్తున్నాడు. ప్రస్తుతం యూఎస్ లో ఉన్నాడు. రీసెంట్ గా తారక్-ప్రణతి.. టైమ్స్ స్క్వేర్ దగ్గర దిగిన ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఓ వక్తిని పట్టుకుని నవ్వుతున్న మరో ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడు తారక్ కి బెస్ట్ ఫ్రెండ్ అని అర్థమవుతుంది కానీ ఎవరు ఏంటనేది ఇప్పుడు తెలిసిపోయింది. ప్రముఖ రచయిత, రాజకీయ నాయకుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కుమారుడే ఎన్టీఆర్ తో ఫొటోలో ఉన్న వ్యక్తి. ఆయన ప్రస్తుతం డెట్రాయిట్ లో ఉన్నారు. వాళ్ల ఫ్యామిలీని కలిసిన సందర్భంలో తారక్ తీసుకున్న ఫొటోనే ఇది. సరే ఇదంతా పక్కనబెడితే తారక్ కొత్త సినిమా త్వరగా మొదలుపెడితే బాగుండు అని మీలో ఎంతమంది అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
#JrNTR recent snap with his close friend SivaRam (S/o Yarlagada Lakshmi Prasad) in Detroit. @tarak9999 #NTR pic.twitter.com/7jioM3eNdZ
— Suresh Kondi (@SureshKondi_) December 29, 2022