తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు వెండితెరపైనే ఎక్కువగా కనిపిస్తారు. ఇక వారికి అభిమానుల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా కొన్ని కార్పోరేట్ సంస్థలు తమ కంపెనీకి అంబాసిడర్లుగా నియమించుకుని, వారిచేత తమ ప్రోడక్ట్ లను కొనమని ప్రచారం చేయిస్తుంటాయి. ఈ క్రమంలోనే సినీ తారలు కొన్ని కొన్ని యాడ్స్ ల్లో మెరడం మనం చూశాం. వెంకటేష్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ లాంటి చాలా మంది స్టార్లు యాడ్స్ చేసిన వాళ్లే. అయితే ఇంత వరకు యాడ్స్ చేయని అతి కొద్ది మందిలో హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. బాలయ్య ఇంత వరకు ఏ కమర్షియల్ యాడ్ ఫిల్మ్ లో నటించలేదు. అయితే తాజాగా ప్రముఖ కార్పోరేట్ సంస్థ అయిన సాయిప్రియా గ్రూప్ సంస్థకు అంబాసిడర్ గా నియమించినట్లు ఆ సంస్థ తెలిపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
నందమూరి బాలకృష్ణ.. పౌరాణిక, జానపద, సామాజిక ఇలా చెప్పుకుంటూ పోతే.. అన్నిరకాల జోనర్లలో సినిమాలు చేశారు. అదీ కాక తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కుర్ర హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ.. వారికి సవాలు విసురుతున్నాడు. తాజాగా ‘అన్ స్టాపబుల్’ టాక్ షో ద్వారా హోస్ట్ గా మారి బుల్లితెర రికార్డులను తిరగరాశారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ అడ్వర్టైజ్ మెంట్ రంగలోకి అడుగుపెట్టబోతున్నారన్న వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రముఖ కార్పోరేట్ సంస్థ సాయిప్రియా గ్రూప్ కన్ స్ట్రక్షన్స్ కు అంబాసిడర్ గా బాలకృష్ణను నియమించినట్లు తెలిపింది. ప్రముఖ ఈవెంట్ నిర్వాహక సంస్థ శ్రేయాస్ మీడియా, బ్రాండ్ ఈ డిజిటల్ సంస్థలు కలిసి యాడ్స్ ను క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Balakrishna’s 1st advertisement!!
We’re Proudly Announcing #NBK is the New Brand Ambassador for @GroupSaipriya 🤗
Ad By @shreyasgroup @BrandeDigital pic.twitter.com/o0dWQNrs6Z
— TrackTollywood (@TrackTwood) October 22, 2022
దానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లు పరిశ్రమ వర్గాల్లో వినికిడి. దీనికి సంబంధించి అటు సాయి ప్రియా గ్రూప్ వారు, శ్రేయాస్ మీడియా సంస్థవారు సోషల్ మీడియా ద్వారా బాలయ్య కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఎన్నో సార్లు అడ్వర్టైజ్ మెంట్ రంగం నుంచి ఆహ్వానం వచ్చినప్పటికీ బాలయ్య అంతగా ఆసక్తి చూపలేదు. అయితే మహేశ్ బాబు తాను నటించే యాడ్స్ ద్వారా వచ్చే మనీని తన ఛారీటి సంస్థకు డోనేట్ చేస్తాడు అన్న విషయం అందరికి తెలిసిందే. మరి బాలయ్య కూడా అదే ఉద్దేశంతో ఈ యాడ్ ఫిల్మ్ చేయడానికి అంగీకరించి ఉంటాడు అని అభిమానులు అనుకుంటున్నారు. ఇప్పటికే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి బాలయ్య వైద్యం అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరనరసింహరెడ్డి’ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
This Diwali marks the beginning of our crackling new chapter💥
THE #GODOFMASSES IS STEPPING INTO THE WORLD OF ADVERTISING WITH HIS FIRST-EVER BRAND COMMERCIAL🤩
We’re Proudly Announcing #NBK is the New Brand Ambassador for @GroupSaipriya 🤗
Ad By @shreyasgroup @BrandeDigital pic.twitter.com/xOreuOsuqQ
— Shreyas Media (@shreyasgroup) October 22, 2022