తెలుగులో ఎన్ని అద్భుతమైన చిత్రాలకు సంగీత అందించిన మణిశర్మ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి సరస్వతి(88) ఆదివారం మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. మణిశర్మ సోదరుడు రామకృష్ణ నివాసంలో ఆమె కన్నుమూశారని, సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మణిశర్మ తల్లి చనిపోవడం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టిన మణిశర్మకు చిన్నప్పుడే సినిమాలంటే ఆసక్తి. ఇది గమనించిన ఆయన తల్లిదండ్రులు చిన్నప్పుడే మణిశర్మకు వయోలిన్ తోపాటు మాండోలిన్, గిటార్ నేర్పించారు. అలా 1982 లో 18 ఏళ్ల వయసులోనే చదువు పూర్తిగా ఆపేసి సంగీత రంగంలోకి దిగిపోయాడు. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలనే కోరిక వల్ల భార్యతో సహా మద్రాసు వెళ్లిపోయారు. సంగీత దర్శకుడు సత్యం దగ్గర కీ బోర్డ్ ప్లేయర్ గా సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా మారి దాదాపు 200కి పైగా సినిమాలకు పనిచేశారు. ప్రస్తుతం మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ కూడా సంగీత దర్శకుడిగా చేస్తున్నారు.
ఇదీ చదవండి: కృష్ణంరాజు మరణానికి అసలు కారణం? ఆ సమస్యే కొంపముంచిందా?