గతకొంత కాలంగా సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. అదీకాక ఇటీవల సినిమా పరిశ్రమలో ప్రముఖ నటులు రోగాల బారిన పడటం కలవరపెడుతోంది. తాజాగా మరో నటుడు అనాగ్యంతో ఆస్పత్రిలో చేరాడు.
గతకొంత కాలంగా సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. కృష్ణం రాజు, కృష్ణల మరణం దగ్గర నుంచి నిన్నటి తారకరత్న మరణం వరకు పరిశ్రమలో ఒకదాని వెంట ఒకటి విషాదాలు కలవరపెడుతూనే ఉన్నాయి. మరణాలతో పాటుగా నటీ, నటులు అనారోగ్య కారణాలతో ఆస్పత్రుల పాలవ్వడం ఈ మధ్య కాలంలో మనం తరచూ వింటున్న వార్తలు. తాజాగా మరో ప్రముఖ నటుడు కాలేయ సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరడన్న వార్త బాధాకరమైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఇటీవల సినిమా పరిశ్రమలో ప్రముఖ నటులు రోగాల బారిన పడటం కలవరపెడుతోంది. తాజాగా మరో నటుడు అనాగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. ప్రముఖ మలయాళ నటుడు బాలా కేరళలోని కొచ్చిలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు అతడిని పరీక్షించిన తర్వాత కాలేయ మార్పిడి చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక బాలా మలయాళంలో ని పలు చిత్రాల్లో కీ రోల్స్ లో నటించారు. బాలా తమిళ స్టార్ ప్రొడ్యూసర్ శివ సోదరుడు. అతడు ప్రస్తుతం సూర్య చిత్రంతో బిజీగా ఉన్నాడు. బాలా ఆస్పత్రిలో ఉన్నాడని తెసుకున్న కొంత మంది నటులు.. అతడిని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వారిలో ముకుందన్, బాదుషా, వినుషా మోహన్ లు ఉన్నారు. బిలాల్, స్థలం, మై డియర్ మచాన్స్ సినిమాల్లో చేసిన మంచి పాత్రల ద్వారా బాలా ఫేమస్ ఆర్టిస్ట్ గా మారాడు. అతడి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.