కాంతార సినిమా ఎన్ని ప్రభంజనాలు సృష్టించిందో.. ఎలాంటి కలెక్షన్లు సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న సినిమాగా విడుదలయ్యి.. దేశవ్యాప్తంగా సంచలనాలు నమోదు చేసింది. వందల కోట్ల కలెక్షన్లు సాధించింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. తాజాగా ఆస్కార్ రేసులో కూడా కాంతార చోటు దక్కించుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా కాంతార సినిమా పేరు మరోసారి వార్తల్లో బాగా నానుతుంది. ఈ సినిమాలో సీన్ ఒకటి.. వాస్తవంగా వెలుగు చూసింది. సినిమాలో.. దేవుడికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన వ్యక్తి.. మెట్ల మీద పడి రక్తం కక్కకుని ఎలా మరణించాడో.. సేమ్ ఇదే సీన్ ఓ ఆలయం వద్ద రిపీట్ అయ్యింది. ఈ మిస్టరీ సంఘటన గురించి పూర్తిగా తెలియాలంటే.. ఈ వార్త చదవండి.
ఈ మిస్టరీ సంఘటన కర్ణాటక, ఉడిపిలో చోటు చేసుకుంది. పదుబిద్రి అనే గ్రామంలో పదుహిట్లు జరందయ దేవస్థానం ఉంది. మన దగ్గర ఆలయం ఏలానో.. ఇక్కడ దేవస్థానం అలా అన్నమాట. ఇక ప్రతి ఏటా.. ఇక్కడ నేమోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. గ్రామస్తులంతా చేరి.. వేడుకలు చేసుకుంటారు. ఇక జరందయ దేవస్థాన నిర్వహణ కోసం ఓ కమిటీ ఉంది. దీనికి ప్రకాశ్ శెట్టి అనే వ్యక్తి ఛైర్మన్గా ఉండేవాడు. అయితే పదవీకాలం పూర్తయిన తర్వాత కొత్త కమిటీ ఏర్పడింది. దాంతో ప్రకాశ్ శెట్టి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అన్ని రోజులు అధికారం అనుభవించి.. ఇప్పుడు దాన్ని వదులుకోవడం ప్రకాశ్ శెట్టికి ఇష్టం లేకపోయింది. ఎలా అయినా సరే.. తిరిగి పదవి దక్కించుకోవాలనుకున్నాడు. దానిలో భాగంగా.. ఐదుగురు వ్యక్తులతో కలిసి కొత్త కమిటీ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత తనకు నచ్చిన వ్యక్తిని ప్రధాన పూజారిగా నియమించాడు.
ప్రతి ఏటా నిర్వహించే నేమోత్సవాన్ని.. ఈ సారి జనవరి 7న నిర్వహించి.. కోలం వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై ప్రకాశ్ శెట్టి.. అతడు నియమించిన పూజారి నిరసన వ్యక్తం చేస్తూ.. కోర్టుకు వెళ్లారు. స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఆ మరుసటి రోజు.. నూతన పూజారి.. ఆలయంలోకి వెళ్తుండగా.. ఒక్కసారి కుప్పకూలి పోయి.. మృతి చెందాడు. దైవానికి వ్యతిరేకంగా వెళ్లడం వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులు భావించారు. అయితే ఇంత జరిగినా ప్రకాశ్ శెట్టి మారలేదు. బెదిరింపులకు తెగబడ్డాడు. ఆఖరికి దరంజయ దేవస్థాన దైవ నర్తకుడు భాస్కర బంగేరానిని వేధింపులకు గురి చేయడమే కాక.. దేవుడు ఆవహించినప్పుడు.. తన మాటలను.. దేవుడి మాటలుగా చెప్పాలని బెదిరించాడు.
ఇక ఆలయ పూజారి మరణం కారణంగా జనవరి 7న జరగాల్సిన నేమోత్సవ వేడుకలను దేవస్థాన కమిటీ వాయిదా వేసింది. కానీ ప్రకాశ్ శెట్టి, అతడి అనుచరులు మాత్రం.. కమిటీ నిర్ణయాన్ని పట్టించుకోకుండా.. వేడుకలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. అయితే ప్రకాశ్ శెట్టి తీరుతో విసిగిపోయిన గ్రామస్తులు.. అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఊరి వాళ్లంతా సమావేశమై.. సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన జందయ బంట సేవా సమితి కమిటీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు.
కాంతార సినిమాలో కూడా ఇలాంటి సన్నివేశం కనిపిస్తుంది. పంజుర్లి అనే దైవం ఉంటుంది. ఓ రాజు పంజుర్లి దైవ కోసం గ్రామస్థులకు కొంత భూమి దానం చేస్తాడు. కానీ తన మనవడు.. గ్రామానికి వచ్చి.. ఆ భూమి తనదని.. దాన్ని తిరిగి తనకు అప్పగించాలని డిమాండ్ చేస్తాడు. దీనికి పంజుర్లి దైవ ఒప్పుకోకపోవడంతో.. కోర్టుకెళ్తాడు. అనంతరం అక్కడే కోర్టు మెట్లపైన రక్తం కక్కకుని చనిపోతాడు. ఇదే సీన్.. ఇప్పుడు వాస్తవంగా కనిపించింది. దాంతో దైవానికి వ్యతిరేకంగా వెళ్తే.. ఇలాంటి ఫలితాలే చవి చూడాల్సి వస్తుంది అంటున్నారు ప్రజలు. మరి ఈ సంఘటన గురించి మీరేం అనుకుంటున్నారు.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.