సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీకి తెరలేపే బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ తాజాగా మరో కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఇండస్ట్రీకి చెందిన ఓ కపుల్ తనపై నిఘా పెడుతూ తన ప్రతి కదలికను గమనిస్తున్నారని.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారం లీక్ చేస్తూ తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ తన ఇన్స్టాలో స్టోరీస్లో ఓ నోట్ రాసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
గత కొంత కాలంగా నేను ఎక్కడికి వెళ్తున్నాను.. ఏం పనులు చేస్తున్నాను.. చివరికి నా ఇంటి వద్ద ఏం జరుగుతుందన్న విషయం పై నిఘా పెట్టారు. అంతేకాదు నా కారు పార్కింగ్, నేను మేడపై ఏం చేస్తున్నాను అన్న విషయంపై నిఘా పెట్టి గమనిస్తున్నారు. నేను ఉదయం 6 గంటలకు బయటకు వెళ్తే నన్ను ఫాలో అవుతూ.. నా ఫోటోలు తీస్తున్నారు. ఇక నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలే కాదు.. వృత్తిపరమైన విషయంలో కూడా జోక్యం చేసుకుంటూ నా వాట్సాప్ డేటా అన్నీ లీక్ చేస్తున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. నా వద్ద పనిచేసిన సిబ్బందికి మాయ మాటలు చెప్పి వాళ్ల దగ్గరకు రప్పించుకున్నారు. నన్ను ఒంటరిని చేస్తున్నారు.
ఆ హీరో తన భార్యను నిర్మాతగా మార్చి నేను నటిస్తున్నట్లు లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించాలని బలవంతం చేస్తున్నట్లు తెలుస్తుంది. వాళ్లు ఎంతగా ఫాలో అవుతున్నారంటే.. నా సోదరుడి పెళ్లికి నేను వేసుకున్న డ్రెస్ ఆమె పెళ్లికి వేసుకుంది అంటూ ఇన్ స్ట్రా నోట్ లో రాసింది. బాలీవుడ్ లో ఓ గొప్ప నేపథ్యం ఉన్నప్పటికీ అతను మాత్రం ఆమె విషయంలో ఎన్నో పొరపాట్లు చేస్తున్నాడు. వీటన్నింటి విషయంలో ఆమె అతనిపై ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నాను. అలాగే నాకు సంబంధించిన డేలా అతను ఎలా పొందుతున్నాడో తెలుసుకుంటే చిక్కుల్లో పడతాడు అంటూ హెచ్చరించించింది కంగనా రౌనత్. ప్రస్తుతం కంగనా రౌనత్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదిలా ఉంటే.. ఈ కపుల్స్ బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్స్ రణ్బీర్కపూర్, అలియా అని నెటిజన్లు అంటున్నారు. అంతేకాదు గత కొంత కాలంగా ఈ జంటను కంగనా టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారిని ఉద్దేశించి తన ఇన్స్ స్ట్రా లో నోట్ రాసి ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం కంగనా ‘చంద్రముఖి 2’, ‘ఎమర్జెన్సీ’మూవీలో నటిస్తుంది. ఇటీవల ఆమె పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి మెప్పించింది.