ప్రముఖ సీనియర్ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జయప్రద తల్లి.. నీలవేణి అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందారు. దీంతో జయప్రద హుటాహుటిన ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరారు. జయప్రద తల్లి మృతితో తెలుగు చిత్రపరిశమ్రతో పాటు బాలీవుడ్లోనూ విషాదం నెలకొంది.