ఆదాయ పన్ను శాఖకు పన్ను చెల్లించే వ్యక్తుల్లో భారతదేశంలోనే ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ చెల్లిస్తున్న వ్యక్తి సినిమా రంగానికి చెందిన ఓ నటుడు. దేశంలోని కుబేరుల కంటే ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ చెల్లిస్తున్నాడు ఆ నటుడు.
ఇండియాలో ఎక్కువ ట్యాక్స్ కట్టే ఇండివిజల్ పర్సన్ ఓ సినీ నటుడు అంటే ఎవరైనా నమ్ముతారా? అవును నిజమే భారతదేశంలో ఎక్కువ ట్యాక్స్ కట్టేది మరెవరో కాదు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఈ విషయం తెలిసి చాలా మంది షాక్ అవుతున్నారు. అయితే ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)దాఖలు చేయడానికి గడువు జూలై 31తో ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 6 కోట్లకు పైగా ఐటీఆర్ దాఖలయ్యాయని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. దేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించింది ఎవరని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆదాయపన్ను శాఖ వివరాల ప్రకారం గత సంవత్సరం అంటే 2021-22 సంవత్సరానికి గాను అక్షయ్ కుమార్ భారతదేశంలో అత్యధికంగా పన్ను చెల్లించిన వారి జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్నారు.
2022లో ఆయన నుంచి రూ. 29.5 కోట్ల ఆదాయపు పన్ను జమ అయింది. ఆ ఏడాది తన ఆదాయం రూ.486 కోట్లుగా ప్రకటించారు. అక్షయ్ కుమార్ బాలీవుడ్లో అతిపెద్ద స్టార్స్లో ఒకరు. పారితోషకం కూడా అదే రేంజ్లో తీసుకుంటారు. ఏడాదికి 4-5 సినిమాలు చేస్తున్నారు. ఇది కాకుండా తనకు సొంత ప్రొడక్షన్ హౌస్ , అలాగే స్పోర్ట్స్ టీమ్ కూడా ఉంది. వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా కొనసాగుతున్నారు. 2022కి ముందు కూడా ఇండియాలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తి అక్షయ్ కుమార్. దాదాపుగా 25.5 కోట్ల రూపాయల ఆదాయపు పన్ను డిపాజిట్ చేశారు.
మన దేశంలో మఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా వంటీ ఎందరో టాప్ బిజినెస్మెన్లు ఉన్నారు. సంపాదనలో అయితే వీరి తర్వాతే ఎవరైనా. మరి.. పన్ను చెల్లింపులో ఎందుకు ముందజలో లేరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ.. ఇక్కడ ఓ చిన్న లాజిక్ ఉంది. అక్షయ్ హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ అయ్యింది కేవలం ఇండివిజల్ పర్సన్ కింద. అంబానీ, ఆదానీ కట్టే ట్యాక్స్ లు అన్నీ కార్పొరేట్ ట్యాక్స్ ల కిందకి వస్తాయి. ఇందులో భాగంగానే.. రిలయన్స్, టీసీఎస్, వంటి కార్పొరేట్ కంపెనీలు సంవత్సరానికి కొన్ని వేల కోట్ల పన్నులు చెల్లిస్తాయి. ఇక అక్షయ్ కుమార్ సినిమాల విషయానికి వస్తే.. ఓ మై గాడ్ -2 సినిమా ఆగస్ట్ – 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. దాని తర్వాత బడే మియాన్ చోటే మియాన్, హేరా ఫేరి చిత్రాలు లైన్లో ఉన్నాయి.