టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్ పెళ్లికి సిద్ధమైందనే వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. ఓ పొలిటీషియన్ కుమారుడిని ఈ హీరోయిన్ పెళ్లాడనుందని సమాచారం.
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో కొందరు హీరో, హీరోయిన్లు పెళ్లికి సిద్దమవుతున్నారు. ఇటీవలే హీరో శర్వానంద్ రక్షితా రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీల వివాహం కూడా త్వరలో జరగబోతుందని సోషల్ మీడియలో తెగ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్ కూడా పెళ్లిపీటలెక్కబోతుందని వార్తలు షికారు చేస్తున్నాయి.
మేఘా ఆకాష్.. ఈ యంగ్ హీరోయిన్ వరుస సినిమాలు చేస్తూ తెగ బిజీగా మారిపోయింది. నితిన్ హీరోగా 2017లో వచ్చిన లై సినిమాతో మేఘా ఆకాష్ తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వెంటనే చల్ మోహనన్ రంగ మూవీతో మరోసారి నితిన్ తో కలిసి నటించింది. ఆ తర్వాత తెలుగులో రాజ రాజ చోర, ప్రియమైన మేఘా, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం వంటి సినిమాల్లో నటించింది. ఇక తన అందం, అభినయంతో ఈ హీరోయిన్ కుర్రాళ్ల మనసు లాగేసుకుంది.
అయితే, ఈ హీరోయిన్ తెలుగు, తమిళంతో పాటు హిందీ సినిమాల్లో కూడా నటించి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఇదిలా ఉండగా, ఈ యంగ్ హీరోయిన్ తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కుమారుడితో పెళ్లికి సిద్దమైనట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ పెళ్లికి పెద్దలు ఓకే చెప్పారని, త్వరలో వివాహం కూడా జరగనుందని జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకు నిజంగానే హీరోయిన్ మేఘా ఆకాష్ రాజకీయ నాయకుడి కుమారుడితో పెళ్లికి సిద్దమైందా? లేకుంటే ఇదంతా పుకార్లేనా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.