ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్స్ ధరలను నిర్ణయిస్తూ ఓ పట్టికను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా గతంలో ఉన్న షోలు కూడా తగ్గిస్తున్నామంటూ చెప్పింది. ఇక ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయాన్ని టాలీవుడ్ లోని కొందరు సినీ ప్రముఖుల వ్యతిరేకించారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు సినిమా టికెట్స్ ధరలు, షోలపై స్పందిస్తూ..నాకు ఇండస్ట్రీలో ఉన్న అనుభవంతో చెబుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి తన అభిప్రాయాలు కొన్ని వెల్లడించారు. తాజాగా హీరో సిద్ధార్థ్ సినిమా టికెట్స్ ధరల నిర్ణయంపై స్పందించారు.
హీరో సిద్ధార్థ ఏపీ ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తున్నట్లే… వారి నిర్ణయంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో తెలుగు సినీ పరిశ్రమ ఉక్కిరిబిక్కిరి అవుతుందన్నారు. అదనపు షోలను రద్దు చేయడం, టికెట్ రేట్లను తగ్గించడంతో తెలుగు సినిమాల పరిస్థితి దారుణంగా మారిపోయిందన్నారు.ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ మాత్రం టికెట్ ధరల అంశంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
టాలీవుడ్ ఏపీ ప్రభుత్వ విధానాలపై హీరో సిద్దార్థ్ మాట్లాడుతూ..ఓ రెస్టారెంట్కు తిండి విషయంలో ఎంత రేటు ఉండాలో మీరు చెప్పరు. కానీ సినిమా పరిశ్రమ మీకు ఎందుకు అంత శ్రద్ద?, వాళ్ల పెట్టుబడిని వాళ్లు రికవరీ చేసుకుంటారు.. టికెట్ రేట్ల మీద వచ్చిన జీవో, అదనపు షోలను రద్దు చేయడమనేది ఎంఆర్పీటీ వయలేషన్స్ కిందకు వస్తుంది. దయచేసి సినిమా పరిశ్రమ, బతికే ఛాన్స్ ఇవ్వండి. ఓ థియేటర్ కు ఎంత పెట్టుబడి పెడుతున్నారు.. ఆ ఏరియాను బట్టి సరైన రేటును డిసైడ్ చేయండని ప్రభుత్వానికి సిద్దార్థ్ సూచించాడు. సిద్ధార్థ్ చెప్పిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.