తీరిగ్గా గమనిస్తే ఈ ఒక్క ఫోటోలోనే ఇద్దరు సెలబ్రిటీలను గుర్తు పట్టొచ్చు. పైగా వీరిద్దరు బంధువులు. సినిమా ఇండస్ట్రీలో వేర్వేరు శాఖల్లో పని చేస్తున్నారు. వారి వారి రంగాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
తీరిగ్గా గమనిస్తే ఈ ఒక్క ఫోటోలోనే ఇద్దరు సెలబ్రిటీలను గుర్తు పట్టొచ్చు. పైగా వీరిద్దరు బంధువులు. సినిమా ఇండస్ట్రీలో వేర్వేరు శాఖల్లో పని చేస్తున్నారు. వారి వారి రంగాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంతకీ వారెవరో తెలుసా?. టాప్ మోస్ట్ టెక్నీషియన్. సీనియర్ సినిమాటోగ్రాఫర్. మరొకరు తెలుగు, తమిళ్ భాషల్లో నటించి యాక్టర్గా ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. పైగా మేనమామ, మేనల్లుడు బంధం వీరిది. ఇంక ఆలస్యం చేయకుండా ఈ ఫోటోలో ఉన్న సెలబ్స్ గురించిన వివరాలేంటో చూద్దాం. గెడ్డంతో ఉన్న వ్యక్తి కెమెరామెన్ ఛోటా కె.నాయుడు, ఆయన భుజాలపై ఉన్నది యంగ్ హీరో సందీప్ కిషన్. ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది కదూ.
ఛోటా కె.నాయుడు చాలా కాలంగా తెలుగు ఇండస్ట్రీలో కెమెరామెన్గా వర్క్ చేస్తున్నారు. హిందీ, తమిళ్ మూవీస్ కూడా చేశారు. ఏఎన్నార్, చిరంజీవి వంటి సీనియర్, స్టార్ హీరోలతో పాటు కుర్ర కథానాయకులతోనూ కలిసి పని చేశారాయన. ఆయన తమ్ముడు శ్యామ్ కె.నాయుడు కూడా సినిమాటోగ్రాఫర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కువగా పూరి జగన్నాథ్ సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. అయితే మేనమామల్లా సందీప్ కిషన్కి కెమెరా కంటే నటన మీదే ఆసక్తి. దీంతో చదువుతో పాటు నటనలో శిక్షణ తీసుకున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ నటించాడు.
‘ప్రస్థానం’ తో కెరీర్ స్టార్ట్ చేసి, ‘స్నేహగీతం’, ‘గుండెల్లో గోదారి’, ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’, వంటి పలు చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ‘షోర్ ఇన్ ది సిటీ’ (Shor in the City) అనే హిందీ మూవీ కూడా చేశాడు. తమిళంలోనూ కొన్ని సినిమాలు చేసి గుర్తింపు తెచ్చకున్నాడు. ఇటీవల ‘మైఖేల్’ అనే పాన్ ఇండియా ఫిలింలో కనిపించాడు. ప్రస్తుతం ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు సందీప్ కిషన్. ‘ది ఫ్యామిలీ మెన్’ లోనూ నటించాడు. నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్న సందీప్, మరోవైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాడు.