ఒక్కసినీ పరిశ్రమలోనే కాదు… ఏ పరిశ్రమలో అయిన వారసులు రావడం అనేది కామన్. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఇప్పటికే మూడు తరాలు ఇలా ఏలేస్తున్నారు. అందులో కూడా నటీనటుల వారుసులే ఎక్కువగా నటన వైపు వస్తుంటారు. స్టార్ హీరోల నుండి దర్శక, నిర్మాతల కుమారులు ఎక్కువగా నటులుగా మారుతుంటారు. ఇప్పటికీ రోజుకోకరు వారసులుగా వస్తూనే ఉన్నారు. ఏ మాత్రం సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా వెంటనే ఆ కుటుంబం నుంచి హీరోగా, హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూతురు ఇండస్ట్రీకి పరిచయం కానుందంట.
ఇప్పటికే పూరీ జగన్నాథ్ నట వారసుడిగా ఆకాశ్ పూరీ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. హీరో గా ఆకాశ్ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు. తనదైన నటనతో అందరని ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన కూతురు పవిత్ర పూరీ కూడా ఇండస్ట్రీలోకి రానున్నట్లు టాక్ వినిస్తోంది. అయితే పవిత్ర ఇండస్ట్రీలోకి ఎంట్రీ అనేది హీరోయిన్ గా మాత్రం కాదట. పూరీ జగన్నాథ్ నిర్మాణ సంస్థ “పూరీ కనెక్ట్స” లో పవిత్ర కూడా నిర్మాతగా ఉండనున్నుట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినీ పరిశ్రమలో ఉన్న తక్కువమంది నిర్మాతల్లో పవిత్ర కూడా ఒకరు కాబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
అయితే ప్రస్తుతానికి ఈ విషయంపై ఎలాంటి స్పష్టత రాలేదు. పూరీ కూతురు నిర్మాతగా రానున్నారు అనే వార్త పై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే పూరీ కనెక్ట్స్ అనే పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి పూరీ జగన్నాథ్ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లైగర్తో డైరెక్టర్గా ఫాంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు పూరీ. ఈక్రమంలో పవిత్ర కూడా నిర్మాతగా మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి.. ఈవిషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.