దీప్తి సునైనా అనగానే ఓ ఆ అమ్మాయా.. యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటుంది. బిగ్ బాస్ షోకు కూడా వచ్చింది అని చాలామంది గుర్తుపట్టేస్తారు. ఇక షన్ను అలియాస్ షణ్ముక్ జస్వంత్ తో ఆమె కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చాలానే చేసింది. వీళ్లిద్దరి రీల్ జోడీగానే కాకుండా రియల్ జోడీగానూ చాలానే గుర్తింపు తెచ్చుకున్నారు. చేతులపై పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నారు. ఏమైందో ఏమో గానీ గతేడాది వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకొన్నారు. ఆ తర్వాత నుంచి ఎవరికీ వారు సెపరేట్ గా ఉంటున్నారు. పెద్దగా బయటకూడా ఎక్కడా కనిపించడం లేదు. అలాంటి సడన్ గా.. ‘నన్ను తిట్టుకోవద్దు’ అని దీప్తి పోస్ట్ పెట్టడం ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. స్టార్స్ అంటే ఒకప్పుడు సినిమా హీరోహీరోయిన్లు మాత్రమే. కానీ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత డబ్ స్మాష్, టిక్ టాక్ లాంటి యాప్స్ వచ్చాయి. వీటితో పాటు ఇన్ స్టా, స్నాప్ చాట్ ద్వారా సామాన్యులు కూడా సెలబ్రిటీలు అయిపోతున్నారు. అలాంటి వారిలో దీప్తి సునైనా ఒకరు. ఫస్ట్ ఫస్ట్ డబ్ స్మాష్ లో వీడియోలు చేసిన ఈ భామ.. ఆ తర్వాత యూట్యూబ్ లో షన్నుతో కలిసి కవర్ సాంగ్స్ చేస్తూ వచ్చింది. అలా రీల్ జోడీ కాస్త ప్రేమలో పడ్డారు. ఆ విషయాన్నే చాలాసార్లు చెప్పారు కూడా. ఇక బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత దీప్తి క్రేజ్ మరింత పెరిగింది.
ఇక షన్ను.. బిగ్ బాస్ 5వ సీజన్ లో పాల్గొనడం, ఆ తర్వాత బయటకు రావడం, కొన్నాళ్లకు ఇద్దరూ అనుకుని బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఈ టైంలో ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. వీరిద్దరూ మళ్లీ కలిస్తే బాగుండు అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ అది జరిగేలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఎవరికి వారు సాంగ్స్, షూట్స్ అని బిజీ అయిపోయారు. దీప్తి నటించిన ‘ఏమోనే’ అనే ఆల్బమ్ సాంగ్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఇందులో చాలా అందంగా ఈమె కనిపించింది. ఇక ఈ పాట కోసం ఆమె ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. ఇది సంక్రాంతి తర్వాతే అంటే జనవరి 18న రిలీజ్ చేస్తామని దీప్తి చెప్పింది. అప్పటివరకు తనని తిట్టుకోవద్దని రిక్వెస్ట్ చేసింది. ఆ గ్యాప్ లో కొన్ని సీన్స్ లీక్ చేస్తానని ఫన్నీగా క్యాప్షన్ కూడా పెట్టింది. సరే దీప్తి సునైనా అనగానే మీకు ఏం గుర్తొస్తుంది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.