ప్రముఖ హాస్యనటుడు వడివేలు ఇంట్లో విషాదం నెలకొంది. పేరుకే తమిళ నటుడు అయినప్పటికీ.. తెలుగులోనూ ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్స్ లో ఈయన ఒకడు. తన మేనరిజంకు స్పెషల్ అభిమానులు చాలామందే ఉన్నారు. అయితే పలు కారణాల వల్ల వడివేలుపై తమిళ ఇండస్ట్రీలో నిషేధం విధించారు. దీంతో ఈయన కొన్నేళ్లపాటు సినిమాల్లో నటించలేదు. కొన్నాళ్ల ముందే రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన పలు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు. గతేడాది చివర్లో ‘నాయి శేఖర్ రిటర్న్స్’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన.. ప్రస్తుతం ‘చంద్రముఖి 2’లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఆయన ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
ఇక విషయానికొస్తే.. ప్రముఖ హాస్యనటుడు వడివేలు తల్లి పాప(87) పలు అనారోగ్య సమస్యలతో మరణించారు. మధురై దగ్గర్లోని సొంతూరు విరగానూర్ లో ఉంటున్న ఆమె.. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యల వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గత రాత్రి పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచారు. ఈ క్రమంలోనే షూటింగ్ లో ఉన్న వడివేలు.. తక్షణమే ఊరికి వెళ్లిపోయారు. ఇక వడివేలు తల్లి చనిపోవడంపై పలువురు నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. కొందరు యాక్టర్స్.. గురువారం సాయంత్రం జరిగే ఆమెఅంత్యక్రియలకు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
Veteran comedy actor #Vadivelu’s mom #Sarojini (87) passed away. #RIP pic.twitter.com/jCxsFcRy5Y
— Rajasekar (@sekartweets) January 19, 2023