బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ పై నటుడు బెల్లంకొండ గణేష్ క్లారిటీ ఇచ్చారు. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇదో సర్ ప్రైజ్ అనే చెప్పాలి.
తెలుగు సినీ ఇండస్ట్రీలో విశ్వ విఖ్యాత నటసార్వభౌముడిగా బిరుదాంకితుడైన నందమూరి తారక రామారావు నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేశారు. తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకుని తన మాస్ డైలాగులతో అదరగొడుతూ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు బాలకృష్ణ. అయితే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ పై నటుడు బెల్లంకొండ గణేష్ క్లారిటీ ఇచ్చారు. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇదో సర్ ప్రైజ్ అనే చెప్పాలి.
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ సస్పెన్స్ గానే ఉండసాగింది. అప్పుడప్పుడు మీడియా కంటపడిన మోక్షజ్ఞ సినిమాల పట్ల అంతగా ఇంట్రెస్ట్ లేనట్లుగానే కనిపించారు. అయినప్పటికి ఫలానా సినిమాతోనే ఎంట్రీ అంటూ వార్తా కథనాలు పుట్టుకొచ్చాయి. తనయుడి కోసం తానే దర్శకత్వం వహిస్తానని బాలకృష్ణ చెప్పారు. కానీ అది ముందుకు సాగ లేదు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ క్రమంలో బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే వార్త చెప్పారు హీరో బెల్లంకొండ గణేష్. తాజాగా ఆయన ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తారా అని యాంకర్ అడగగా దానికి బదులిస్తూ బెల్లంకొండ గణేష్ తాను, మోక్షజ్ఞ మంచి ఫ్రెండ్స్ అని, కలిసి సినిమాలకు వెళ్తామని చెప్పారు. రామ్ చరణ్ నటించిన రచ్చ సినిమాకు ఇద్దరం కలిసే వెళ్లామని తెలిపాడు. మోక్షజ్ఞ సినిమాల్లోకి వచ్చేందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉంటుందని చెప్పారు. డైలాగులు కూడా కనుబొమ్మలతోనే పలికిస్తాడని తెలిపారు. మోక్షజ్ఞ కు నటనా స్కిల్స్ ఉన్నాయని, డ్యాన్స్ కూడా బాగా చేస్తారని చెప్పాడు. బాడీలో మంచి ఈజ్ ఉందని, ఖచ్చితంగా మంచి యాక్టర్ అవుతారని బెల్లంకొండ గణేష్ స్పష్టం చేశారు. ప్రేక్షకులను మెప్పిస్తాడని, తాత గారు, నాన్న గారి పేరు నిలబెడతాడని చెప్పారు. ఇక ఈ సమాచారంతో నందమూరి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.