తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ వచ్చాయి.. కానీ కొన్ని సీరియల్స్ బాగా ఫేమస్ అయ్యాయి. అలాంటి సీరియల్స్ ఒకటి ‘కార్తీకదీపం’. బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్. ఈ సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క పేర్లు మారుమోగాయి. ‘కార్తీకదీపం’ సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబు క్యారెక్టర్స్ చనిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారి వారసుల కథ తో కొత్త కోణం మొదలు పెట్టారు.
కార్తీకదీపం సీరియల్ ఎక్కువగా డాక్టర్ బాబు, వంటలక్కల చుట్టూనే కథ నడిచేది. డాక్టర్ బాబు, వంటలక్కలు కలుస్తారా? లేదా అన్న కథాంశంతో చాలా ఏళ్లు నడిపించారు. మొత్తానికి వారు కలిసే సమయానికి క్యారెక్టర్లను చంపేసి శుభం కార్డ్ వేయకుండా.. అప్పటి చిన్న పిల్లలు పెద్ద అయి అక్కా చెల్లెల్ల కథతో ‘కార్తీకదీపం’ సీరియల్ని సాగదీస్తున్నారు. కొత్త క్యారెక్టర్లతో కార్తీక దీపం బాగానే ఆకర్షిస్తుంది.
ఈ సీరియల్ లో కొన్ని క్యారెక్టర్లు ప్రతికారం కోసం చూసే విధంగా తీర్చి దిద్దారు. ఇంట్లో నుంచి జ్వాల వెళ్లి వస్తుంది.. ఆటో డ్రైవర్ గా కొత్త అవతారం ఎత్తుతుంది. స్వప్న, జ్వాలకు మద్య గొడవలు జరుగుతుంటాయి. జ్వాలపై స్వప్న పగబడుతుంది.. ఈ నేపథ్యంలోనే జ్వాల ఆటోకి నిప్పు పెట్టేసింది. తన ఆటో కాలిపోవడంతో జ్వాల కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సీరియల్ ప్రభావం ఇప్పుడు ఆటో డ్రైవర్లపై పడింది. జీవనోపాది కలిగించే ఆటోని అలా ఎలా కాల్చి చూపిస్తారు.. పగ ఉంటే వేరే విధంగా తీర్చుకునేలా చూపించాలని అని డ్రైవర్ల యూనియన్ పెద్ద ఎత్తున గొడవకు దిగారు.
ఫస్ట్ కార్తీక దీపం లో ఆటోని కాల్చిన సీన్ డిలీట్ చేయాలని.. లేదంటే పెద్ద ఎత్తున గొడవ చేస్తామని హెచ్చరించారు. ఏదో సీరియల్ లో ఎమోషన్ కనెక్ట్ అవుతుందని ఈ సీన్ క్రియేట్ చేస్తే.. ఆటో యూనియన్లు ఇంతగా ఫైర్ అవ్వడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారు. మరీ ఈ సీన్ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.