తెలుగులో యాక్టర్స్ చాలామంది ఉన్నట్లే యాంకర్స్ కు కూడా అస్సలు కొదవ లేదు. సుమ, ప్రదీప్, శ్రీముఖి మాత్రమే టాప్ లో ఉంటూ, షోలు చేస్తున్నప్పటికీ.. మిగతా యాంకర్స్ కూడా తమ మార్క్ చాటుకుంటా షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ అని కాస్త బిజీ బిజీగానే ఉంటున్నారు. ఇక యాంకర్ వింధ్య గురించి కూడా మనలో చాలామందికి తెలుసు. తెలుగు షోల్లో కనిపిస్తూనే.. ఇండియా మ్యాచులకు స్పోర్ట్స్ ప్రెజెంటర్ గానూ చేస్తోంది. అటు కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఈమె.. ఇప్పుడు తండ్రి గురించి చాలా పెద్ద ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. వింధ్య విశాఖ తెలుగమ్మాయి. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె.. పలు చిన్న షోలు, వంటల ప్రోగ్రామ్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఇక స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా ఈమె చాలామందికి తెలుసు. అయితే ఆమె ఫ్యామిలీ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు తన తండ్రి గురించి ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన ఆమె.. చాలా విషయాలు చెప్పుకొచ్చింది. ఆయన ఆరోగ్యం చాలా సీరియస్ అయిందని, అయితే అందరి సాయంతో రియాల్టీని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశానని చెబుతూ తండ్రి ఫొటోలు కొన్నింటిని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
‘ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా రియాల్టీని అంగీకరించడం ఈ ఇయర్ లోనే నేర్చుకున్నాను. గత తొమ్మిదేళ్లుగా మా నాన్న కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. మధ్యలో హెల్త్ బాగానే ఉందనిపించింది. కానీ ఓ టైంలో డయాలసిస్ కచ్చితంగా చేసుకోవాలని డాక్టర్స్ తేల్చేశారు. కొన్నిసార్లు నాన్న హెల్త్ కండీషన్ సీరియస్ అయింది. కొత్త ఇన్ఫెక్షన్స్ ఆయన వచ్చాయి. ఈ క్రమంలోనే భయం, ఆందోళన ఎక్కువవడంతో నాన్న హెల్త్ మరింతగా క్షీణించింది. దీంతో రియాల్టీని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంతకంటే వేరే దారి నాకు కనిపించలేదు. ఇప్పుడు ఆయన కొంతవరకు బాగానే ఉన్నారు. నవంబరులో నన్ను చూసేందుకు ముంబయి వచ్చారు. ఆయన మనోబలం, వెనకడుగు వేయని ధైర్యం చూస్తే హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తోంది’ అని వింధ్య తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ఇక తండ్రి హెల్త్ సీరియస్ కావడం, ఈ ఏడాది ఎన్నో సమస్యల్ని ఎదుర్కొని నిలబడిన తీరు గురించే ఆమె ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ పోస్టుపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి.