అల్లు అర్జున్ తన స్నేహితులతో కలిసి బెంగళూరు వెళ్తుండగా మార్గం మార్గ మధ్యలో అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలం కనుంపల్లిలో ఆగారు. దీంతో స్థానిక టీడీపీ నేతల నుంచి ఫామ్హౌస్కి స్వాగతం లభించింది.
టాలీవుడ్ ‘స్టైలిష్ స్టార్’, ‘పుష్ప’ తో సాలిడ్ బ్లాక్బస్టర్ కొట్టి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్.. ఇప్పుడు ‘పుష్ప 2’ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా కొద్ది రోజుల క్రితం వరకు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంది. తాజాగా అల్లు అర్జున్ తెలుగు దేశం పార్టీకి చెందిన నేత ఫామ్హౌస్లో దర్శనిమిచ్చాడు. అంతే కాదు అక్కడ పసందైన రాయలసీమ వంటకాలతో బన్నీ విందు భోజనం ఎంజాయ్ చేశారు. దీంతో ఈ న్యూస్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన పిక్స్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బన్నీ, టీడీపీ నేతను కలవడం వెనుక రాజకీయ పరమైన మరో కోణం ఉందా? అని చర్చించుకుంటున్నారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అల్లు అర్జున్ తన స్నేహితులతో కలిసి బెంగళూరు వెళ్తుండగా మార్గం మార్గ మధ్యలో అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలం కనుంపల్లిలో ఆగారు. దీంతో స్థానిక టీడీపీ నేతల నుంచి ఫామ్హౌస్కి స్వాగతం లభించింది. శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి అల్లు అర్జున్ని తన ఫామ్హౌస్లోకి తీసుకువెళ్లారు. ఆయన కుమారుడు రాహుల్ రెడ్డి కూడా బన్నీకి స్వాగతం పలికారు. రకరకాల రాయలసీమ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. బన్నీ వచ్చాడని తెలియగానే జనాలంతో అక్కడికి తరలి వచ్చారు. దాంతో ఆ చుట్టుపక్కల సందడి వాతావరణం నెలకొంది.
అక్కడి వారు ఆయనతో ఫోటో కోసం ఎగబడ్డారు. భోజనం అనంతరం బయట ఫోటోలకు ఫోజులు ఇచ్చిన అల్లు అర్జున్.. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి బెంగుళురు వెళ్లిపోయారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. బన్నీ గత 3 సంవత్సరాలుగా లాంగ్ హెయిర్తో కనిపిస్తున్నాడు. ఇప్పుడు హెయిర్ ఇంకాస్త పెరిగింది. ఈ లుక్ ‘పుష్ప 2’ కోసమేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి అల్లు అర్జున్ ఫోటోలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ రూపంలో తెలపండి.