టాలీవుడ్ లో సీనియర్ నిర్మాతలలో అల్లు అరవింద్ ఒకరియూ గీత ఆర్ట్స్ బ్యానర్లో ఎన్నో హిట్ సినిమాలను అందించాడు. ఎప్పుడూ ఎవరినీ ఒక్క మాట కూడా అనని అల్లు అరవింద్.. తాజాగా తన ద్వారా పైకొచ్చిన వాళ్లే మోసం చేశారని విచారం వ్యక్తం చేసాడు.
టాలీవుడ్ లో సీనియర్ నిర్మాతగా పేరుగాంచిన వారిలో అల్లు అరవింద్ మొదటి వరుసలో ఉంటారు. భారీ బడ్జెట్ సినిమాలు తెస్తూ భారీ హిట్లు కొడుతూ తన జీవితంలో “వన్ ఆఫ్ ది బెస్ట్” ప్రొడ్యూసర్ గా నిలిచాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో గొప్ప సినిమాలు అందించాడు. అయితే ఒకరు ఇంత సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యారంటే దర్శకులకి ఎంతో స్వేచ్ఛని ఇవ్వడంతో పాటు వారి మీద నమ్మకం కూడా ఉంచాలి. సరిగ్గా తన దర్శకుల విషయంలో అల్లు అరవింద్ ఇలానే చేసాడు. అయితే జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో తనని కూడా కొంతమంది మోసం చేసి వెళ్లిపోయారని అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఒక ఈవెంట్ లో మాట్లాడిన మాట్లాడు ఇపుడు వైరల్ గా మారాయి.
మలయాళంలో ఇటీవలే బ్లాక్ బస్టర్ గా నిలిచినా సినిమా “2018”. ఈ సినిమా 160 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఇదే సినిమాని బన్నీ వాసు గీత తెలుగులో కూడా రిలీజ్ చేయగా మంచి కలెక్షన్లు రాబడుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన థాంక్స్ మీట్లో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తనను తన ద్వారా పైకొచ్చిన దర్శకులు తనని మోసం చేశారని చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎంతో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరున్న అల్లు అరవింద్ ఎప్పుడు ఇలాంటి కామెంట్లు చేయలేదు.
ఈ విషయంపై అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “చందు మొండేటి సినిమా తీసి దాదాపు సంవత్సరం అయిపోయింది. ఆ తర్వాత ఎన్ని ఆఫర్ లు వచ్చినా.. నాతో కమిట్ మెంట్ ఉన్న కారణంగా మరో సినిమా చేయలేదు. కానీ ఇంతకు ముందు సినిమా రిలీజ్ కాక ముందే మాతో రెండు సినిమాలు చేయాలన్న కమిట్మెంట్ నాతో ఉంది. సినిమా రిలీజ్ కాకముందే తను గొప్ప డైరెక్టర్ అని గ్రహించి నేను బుక్ చేసుకున్నాను. నా ద్వారా పైకొచ్చిన వాళ్లలో చాలా మంది ఆ గీత దాటి వెళ్లి సినిమాలు చేసిన వాళ్లు ఉన్నారు. వారి పేర్లు నేను చెప్పదలచుకోలేదు. కానీ చందు మొండేటి మాటకు నిలబడి పోయారు. ఎంత మంది ఎన్ని చెప్పినా.. నేను అరవింద్గారి సినిమా చేసిన తర్వాతే చేస్తానని నిలబడ్డారు’’ అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు. మరి అల్లు అరవింద్ ఎవరిని ఉద్దేశించి ఏ వ్యాఖ్యలు చేసాడో తెలియడం లేదు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.