హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తన కెరీర్లో ఎదుర్కుంటున్న పరిస్థితుల గురించి వివరిస్తూ.. స్టార్ డైరెక్టర్లు, హీరోలు, మేకర్స్పై అసంతృప్తి వ్యక్తం చేసింది.
కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయే. తన తండ్రి రాజేష్ గతంలో హీరోగా అనేక సినిమాల్లో నటించారు. అయితే తమ ఫ్యామిలీ తమిళానాడులో స్ధిరపడటంతో ఐశ్యర్య తన యాక్టింగ్ కెరీర్ను అక్కడే స్టార్ చేసింది. తెలుగులో పలు సినిమాల్లో కూడా నటించింది. ‘వరల్ట్ ఫేమస్ లవర్’, ‘టక్ జగదీష్’, ‘రిపబ్లిక్’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రజలను మెప్పించింది. కానీ.. ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలకు తననే మేకర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇక తనకు పెద్ద సినిమాల్లో అవకాశాలు రాకపోడం పై ఓపెన్గా మాట్లాడటం ఐశ్వర్యకి అలవాటు. తాజాగా ఈమె తన కెరీర్లో ఎదుర్కుంటున్న పరిస్థితుల గురించి వివరిస్తూ.. స్టార్ డైరెక్టర్లు, హీరోలు, మేకర్స్పై అసంతృప్తి వ్యక్తం చేసింది.
‘‘చాలా మంది స్టార్స్, ఇతర ప్రముఖులు నా యాక్టింగ్ స్కిల్స్ గురించి స్టేజ్పై మెచ్చుకుంటున్నారు. కానీ, వాళ్లు నిర్మిస్తున్న చిత్రాలలో మాత్రం నాకు అవకాశం ఇవ్వడం లేదు. పెద్ద స్టార్స్ కూడా ఇందుకు అతీతం కాదు. ఇందుకు కారణం లేకపోలేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలు కంటే హీరోయిన్లే ఎక్కువ మంది ఉన్నారు. దీని వల్ల హీరోయిన్స్కు ఎక్కువ అవకాశాలు రావడం లేదు. కానీ, నేను చిన్న బడ్జెట్ ఫిమేల్ సెంట్రిక్ మూవీస్తో నాకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాను. కాబట్టే నన్ను అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే నేను నటించిన ఐదు తమిళ సినిమాలు విడుదలయ్యాయి. రీసెంట్గా నేను లీడ్ రోల్లో నటించిన ‘ఫర్హానా’ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం నా చేతిలో ఏడు ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తంగా అయితే తమిళ సినిమాలతోనే బిజీగా ఉన్నాను. అవకాశం వస్తే తెలుగులో కూడా నటిస్తాను’’ అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. మరి.. ఐశ్వర్య రాజేష్ వ్యాఖ్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.