ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దీని గురించి ఫిలిం ఇండస్ట్రీతో పాటు మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు.
స్టార్ హీరోయిన్ సమంత విడాకుల వ్యవహారం తర్వాత వరుసగా వార్తల్లో నిలుస్తుంది. నాగ చైతన్యతో విడిపోయాక కెరీర్ మీద గట్టిగా ఫోకస్ చేసి, వరుసగా క్రేజీ మూవీస్ లైనప్ చేసుకుంటుండగా.. అనారోగ్యం బారిన పడింది. ఆమెకు మయోసైటిస్ అనే వ్యాధి సోకడం, ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడం తెలిసిందే. కొద్ది రోజులు హెల్త్ ప్రాబ్లమ్స్తో ప్రొఫెషన్కి బ్రేక్ ఇచ్చిన సామ్, ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమాలకు ఇంట్లోనే డబ్బింగ్ చెప్పి సినిమా అంటే తనకెంత ప్యాషనో ప్రూవ్ చేసింది. ఓ ఇంగ్లీష్ మూవీతో పాటు ‘సిటాడెల్’ వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేస్తోంది. విజయ్ దేవరకొండ పక్కన నటిస్తున్న ‘ఖుషి’ షూటింగ్ ఫైనల్ స్టేజ్కి చేరుకుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దీని గురించి ఫిలిం ఇండస్ట్రీతో పాటు మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ సామ్ తీసుకున్న షాకింగ్ డెసిషన్ ఏంటంటే.. సినిమాల నుండి బ్రేక్ తీసుకుంటుంది. ప్రస్తుతం అనారోగ్యంతో బాధ పడుతున్న సమంత సినిమాల నుండి ఏడాది పాటు లాంగ్ గ్యాప్ తీసుకోబోతుంది. షూటింగ్ దశలో ఉన్నవి కాకుండా కొత్తగా కమిట్ అయిన ఫిలింస్ క్యాన్సిల్ చేసుకుంటుంది. ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చి తన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న నిర్మాతలను పిలిపించి వారి డబ్బు తిరిగిచ్చేస్తుంది.
గత కొంత కాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధ పడుతున్న సమంత, ఈ గ్యాప్లో అదనపు చికిత్స తీసుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని డిసైడ్ అయ్యింది. ‘ఖుషి’ మూవీ మరో మూడు రోజుల షూట్ బ్యాలెన్స్ ఉంది. అలాగే హిందీ ‘సిటాడెల్’ సిరీస్ కూడా పూర్తయినట్లు సమాచారం. సంవత్సరానికి 5, 6 సినిమాల్లో కనిపించే సమంత.. కొన్నాళ్ల పాటు వెండితెర మీద కనిపించదనే సరికి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువగా పలు ప్రాముఖ్యమైన ఆలయాలను దర్శిస్తూ, ఆ ఫోటోలు, మోటివేషన్ కోటేషన్స్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తుంది సామ్.