ఒకప్పుడు తమ గ్లామర్తో ఆడియన్స్ మనసుల్ని దోచుకున్న హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోవడం చూసి.. తమను అభిమానించే వారి మనసు ముక్కలైపోతుంటుంది.
ఒకప్పుడు తమ గ్లామర్తో ఆడియన్స్ మనసుల్ని దోచుకున్న హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోవడం చూసి.. తమను అభిమానించే వారి మనసు ముక్కలైపోతుంటుంది. ఫేడౌట్ అయిపోయిన, పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న వారిని చూసి ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతవుతుంది. ఇప్పుడు పూజా రామచంద్రన్ లేటెస్ట్ ఫోటోస్ కూడా అలాగే వైరల్ అవుతున్నాయి. ఆమె పన్నెండేళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉంది. తెలుగు, తమిళం, మలమాళంలో కలిపి 30కి పైగా సినిమాలు చేసింది. సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ ఎక్కువ పేరు సంపాదించుకుంది. తెలుగు చిత్రాల్లో విలన్ పాత్రలు చేస్తున్న నటుడు జాన్ కొక్కేన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది.
అయితే తాజాగా సోషల్ మీడియాలో తన ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఆమె గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ‘స్వామిరారా’ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న పూజ బెంగుళురులో పుట్టి పెరిగింది. 2004లో మిస్ కోయంబత్తూర్ టైటిల్ గెలిచింది. 2005లో మిస్ కేరళ రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత నటిగా మారింది. తమిళ్ స్టార్ సూర్య ‘సెవెన్త్ సెన్స్’ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో ‘స్వామిరారా’ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
‘దోచేయ్’, ‘దళం’, ‘కృష్ణార్జున యుద్ధం’, ‘వెంకీమామ’ తదితర చిత్రాల్లో నటిచింది. సినిమాల్లోకి రాకముందే 2010లో వీజే క్రెయిన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న పూజ 2017లో అతడికి విడాకులు ఇచ్చింది. 2019లో విలన్ పాత్రలు చేసే జాన్ కొక్కేన్ను మ్యారేజ్ చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ప్రస్తుతం ఫ్యామీలితో సరదగా సమయం గుడుపుతుంది. సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేయగా గుర్తు పట్టలేనంతగా మారిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.