ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ వెండితెర, బుల్లితెర నటులు, దర్శక, నిర్మాతలు కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులే కాకుండా అభిమానులు సైతం కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, రచయిత కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
నటుడు, రచయిత అయిన విద్యాసాగర్ రాజు(73) ఆదివారం ఆయన స్వగృహంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన కెరీర్ నాటక రంగం నుంచి మొదలైంది. విద్యాసాగర్ రాజు మంచి స్టేజ్ ఆర్టిస్ట్. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ చదువులు మాకొద్దు మూవీలో కీలక పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత జంద్యాల తీసిన పలు చిత్రాల్లో తనదైన కామెడీతో కడుపువ్వా నవ్వించారు. జంద్యాల మూవీలో బామ్మగా గుర్తింపు తెచ్చుకున్న రత్నకుమారి భర్త విద్యాసాగ్ రాజు.
ఆయన కెరీర్ లో వంద చిత్రాలకు పైగా నటించారు. నటుడిగా మంచి స్టేజ్ లో ఉండగానే విద్యాసాగర్ కి పెరాలసీస్ రావడంతో కాలు, చేయి పడిపోయింది. అప్పటి నుంచి వీల్ చైర్ కే పరిమితం అయ్యారు. నటుడిగానే కాకుండా పలు చిత్రాలకు కో డైరెక్టర్, రచయిత గా కూడా పనిచేశారు. గత కొంత కాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఇంటి వద్దనే చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.