రెండు తెలుగు రాష్ట్రాలో రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు అల్లడిపోతున్నారు. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న వాయుగుండం మరింత బలపడింది.
ఉత్తరం వైపు గడచిన 06 గంటల్లో 20 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తూర్పున కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర వాయుగుండం దూరములో పోర్ట్ బ్లెయిర్ కి ఈశాన్యంగా 420 కి.మీ దూరములో యాంగోన్ కి నైరుతి దిశలో 270 కి.మీ.దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది అండమాన్ దీవుల నుంచి దాదాపు ఉత్తరం వైపు కదులుతూ..ఈ రోజు మయన్మార్ తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ఫలితంగా మూడు రోజులపాటు అక్కడక్కడ వర్షం కురవనుంది. దీంతో ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.