దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఇండస్ట్రీలో కూడా వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజగా కోవిడ్ కారణంగా ప్రముఖ జర్నలిస్ట్ తుమ్మల నరసింహ రెడ్డి.. అలియాస్ టి.ఎన్.ఆర్ ఈ సోమవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. ఒక సామాన్య పోగ్రామ్ ప్రొడ్యూసర్ గా తెలుగు మీడియాలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈయన తరువాత కాలంలో మంచి టాలెంటెడ్ జర్నలిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ప్రముఖ డిజిటిల్ మీడియాలో ప్రసారమయ్యే “ఫ్రాంక్లి విత్ టి.ఎన్.ఆర్” షో ఈయనకి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. నిజానికి కెరీర్ తొలినాళ్లలోనే టి.ఎన్.ఆర్ యాక్టర్ గా కొన్ని ప్రయత్నాలు చేశాడు. అప్పుడు సరైన అవకాశాలు లభించలేదు. కానీ.., తన ఇంటర్వూస్ ద్వారా గుర్తింపు దక్కించుకున్న తరువాత మాత్రం ఆయనకి సినిమాల్లో మంచి అవకాశాలు లభించాయి. “ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య” మూవీలో టి.ఎన్.ఆర్ నటనకి మంచి గుర్తింపు లభించింది. ఇలా కెరీర్ ఇప్పుడిప్పుడే బిల్డ్ అవుతున్న దశలో టి.ఎన్.ఆర్ అకాల మరణం అందరిని కలచి వేసింది.
ఇక టి.ఎన్.ఆర్ ఎక్కువగా సోషల్ మీడియాలో తన భావాలను పంచుకుంటూ ఉండేవారు. ఈ నేపథ్యంలో ఆయన చనిపోయిన తరువాత టి.ఎన్.ఆర్ చివరిసారిగా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో టి.ఎన్.ఆర్ ఈ విధంగా స్పందించాడు. ” కరోనా కారణంగా నేను బయటకి రావడం లేదు. ఈ ఛాలెంజ్ ని నేను స్వీకరిస్తున్నాను. చెడులో కూడా మంచిని వెతుక్కోమంటారు. ఇంట్లో ఉన్న ఈ సమయాన్ని ఆనందంగా మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. పిలల్లతో కలసి ఆటలు ఆడండి. వారికి మంచి విషయాలను నేర్పించండి. ఇంటి పెద్దలు అస్సలు సహనం కోల్పోవద్దు. మెంటల్ గా పాజిటివ్ గా ఉండండి. ఇందుకోసం నేను ప్రాణయం చేస్తున్నాను” అంటూ.. వీడియో ఆసాంతం చాలా మంచి మాటలు చెప్పారు టి.ఎన్.ఆర్. కానీ.., ఇంతలోనే అయన అదే మహమ్మారి దాటికి కన్ను మూయాల్సి రావడం అందరిని శ్రోక సంద్రంలోకి నెట్టింది. ఏదేమైనా టి.ఎన్.ఆర్ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం.