నేడు టోక్యో ఒలంపిక్స్ ఫైనల్ మ్యాచ్లో రెజ్లర్ రవికుమార్ ఓడిపోయి రజత పతకంతో మురిపించాడు దీంతో ఆయనకు ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే తాజాగా రవి కుమార్పై ఆయన సొంత రాష్ట్రమైన హరియాణా సీఎం మనోహర్లాల్ ఖట్టార్ రవికుమార్పై ప్రసంశలు కురిపించారు. దీంతో పాటు ఆయనకు భారీ నజరానా కూడా ప్రకటించారు సీఎం. ఇక రూ. 4 కోట్ల నగదు, క్లాస్ 1 ఉద్యోగంతో ఇస్తామని తెలిపారు. ఇది కాక ఇంటి స్థలంతో పాటు రవి స్వగ్రామంలో రెజ్లింగ్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తామని తెలిపారు సీఎం మనోహర్లాల్ ఖట్టార్.
అనూహ్య రీతిలో సాగిన ఈ పోరులో ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన రెజ్లర్ జవుర్ ఉగేవ్ చేతిలో 7-4 తేడాతో రవికుమార్ ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టాడు. దీంతో రవికుమార్ పతకంతో భారత పతకాల సంఖ్య ఐదుకు చేరింది. దీంతో ఎట్టకేలకు స్వర్ణం పతకాన్ని తీసుకొస్తాడని అందరూ ఎదరుచూశారు. కానీ నేడు జరిగిన హారాహోరిగా మ్యాచ్లో మొదట్లో పుంజుకు అనూహ్యంగా కాస్త వెనకబడ్డారు. దీంతో రవి కుమార్కు ఫైనల్లో ఓడిపోయినా వెండి పతకంతో మెరిసి మురిపించాడు.