ప్రముఖ ఈటీవి ఛానల్లో ప్రసారమవుతున్న‘జబర్ధస్త్’కామెడీ షో ఎంత పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇందులో నటించిన నటులు ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో పంచ్ ప్రసాద్ ఒకరు. తన స్కిట్లతో అభిమానులను నవ్వించిన పంచ్ ప్రసాద్ నిజజీవితంలో ఆ నవ్వులు లేకుండా పోతున్నాయి.
ప్రముఖ ఈటీవి ఛానల్లో ప్రసారమవుతున్న‘జబర్ధస్త్’కామెడీ షో ఎంత పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇందులో నటించిన నటులు ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు. బుల్లితెరపై జబర్ధస్త్ షో కి వచ్చిన ఆదరణ చూసి ఇతర ఛానల్స్ వాళ్లు అలాంటి ప్రోగ్రామ్స్ ప్రారంభించినా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. బజర్ధస్త్ ఆర్టిస్ట్ లు తమ కామెడీ టైమింగ్, పంచ్ లతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి వారిలో పంచ్ ప్రసాద్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా తన స్కిట్లతో అభిమానులను నవ్వించిన పంచ్ ప్రసాద్ నిజజీవితంలో ఆ నవ్వులు లేకుండా పోతున్నాయి. కష్టాలు.. కన్నీళ్లతో జీవితం నెట్టుకొస్తున్నారు. కొంత కాలంగా కిడ్నీ సమస్యతో ప్రసాద్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పలువురు దాతలు ముందుకు వచ్చి ఆయనకు సహాయం అందించారు. రెగ్యూలర్గా డయాలసీస్ చేయించుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం ఇంకా మెరుగపడలేదు. నవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది.
అతడు ఒక యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఓ ఇంటర్య్వూలో పాల్గొని పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను బయటికి వెల్లడించారు. అలాగే నాకు ఆరోగ్యం బాగా లేనందుకు జబర్దస్త్ ఆర్టిస్టులు, నాగబాబు, రోజా గారు చాలా సహాయం చేశారని ఆయన వ్యక్తం చేసారు. ఇంకా నా పక్కనే ఉన్నా కిరాక్ ఆర్పి గారు కూడా లక్ష రూపాయల సాయం చేసాడని పంచ్ ప్రసాద్ తన కామెంట్ల రూపంలో చెప్పుకొచ్చాడు. ఇంకా చెప్పాలంటే.. నూకరాజు అన్నయ్య మాత్రం నాకు సొంత బ్రదర్ కన్నా ఎక్కువ అని తెలియజేసాడు. ఈ నేపథ్యంలోనే పంచ్ ప్రసాద్ భార్య ట్యాబెట్లు వాడటం కంటే సర్జరీ చేయించుకుంటే చాలా బెటర్ అని డాక్టర్లు చెప్పారంటు.. తన భార్య కామెంట్ల రూపంలో చెప్పారు. ఇంకా ఏంటంటే నా భార్య నా పిల్లల కంటే నా గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తుందని..పంచ్ ప్రసాద్ అన్నారు.
అయితే నా భార్య ఎప్పటికైనా భాదపెట్టనని..అసలు నా భార్య లేకపోతే నేను 5 సంవత్సరాల క్రితమే చనిపోయేవాడినని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. నాకు లెగ్ ఇన్ఫ్క్షన్, పారా థైరాయిడ్, బ్లడ్ కూడా తక్కువ ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. అయినప్పటికి ఆపరేషన్ చేస్తే కొంతమందికి సక్సెస్ అవుతుందని.. మరికొంతమందికి సక్సెస్ కాదని నేను ఆపరేషన్ చేస్తా అంటే దానికోసమే భయపడ్డాను అని ప్రసాద్ పేర్కోన్నాడు. ఇంకా ముఖ్యంగా అయితే పిల్లల కోసం ఆలోచించి సర్జరీ ఆలస్యం చేసానని.. నా శరీరం బలంగా ఉన్నప్పుడే సర్జరీ చేయించుకుంటే చాలా మంచిదని డాక్టర్లు చెప్పారు. అయితే నాకు గతంలో చాలా మంది సహాయం చేస్తా అన్నారు కానీ నేను వాళ్లందరికి నో చెప్పాను. ఇప్పటికి కూడా నా గురించి చాలా మంది ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు. నాకు ఎక్కువగా నా పిల్లల్ని చూస్తే బాగా ఏడ్పుస్తుందని తెలిపారు.