పైలట్ ఆ విమానంలో ఆక్సిజన్ నిలిపేసి ప్రయాణికులను చంపేశాడు. ఇదో చరిత్రలో నిలిచిపోయిన భయంకర వాస్తవమా ఊహా అని పూర్తిగా తెలియకపోయినా బయటపడ్డ కొన్ని ఆధారాలుఇదే నిజమని రుజువు చేస్తున్నాయి. విమానాన్ని గుర్తుతెలియని ప్రాంతంలో కూల్చేశాడు. ఇప్పటికీ ఇదే నిజమని భావించవలసి వస్తోంది. ఎందుకంటే ఎన్నో ప్రయత్నాలు., ఎన్నో బృందాలు పరిశోధన చేసాయి… చేస్తున్నాయి. ఆచూకీ లేకుండా పోయిన MH370 మలేషియా విమానం వెనుక దాగిన మిస్టరీని ఛేదించేందుకు ఇదీ ఇప్పటికీ ఏర్పాటైన నిపుణుల బృందం అభిప్రాయం. 2014, మార్చి 8వ తేదీన కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు వెళ్తున్న MH 370 విమానం అకస్మాత్తుగా మాయమైన సంగతి తెలిసిందే.
ఆ విమానం ఆచూకీ లేకపోడానికి కారణం పైలట్ జహారీ అహ్మద్ షా అని నిర్ధారించారు. ఈ విమానం కోసం ప్రపంచ దేశాలు ఏకమై సోధించినా దాని ఆచూకీ తెలియలేదు. డిప్రెషన్తో బాధపడుతున్న పైలట్ వల్లే విమానం ప్రమాదానికి గురైనట్లు ఈ టీమ్ నిర్ధారణకు వచ్చింది. ప్రమాదం జరిపిన తర్వాత పైలట్ గురించి బంధువులు, స్నేహితుల ద్వారా లభించిన సమాచారం మేరకు నిపుణులు ఈ అంచనాలకు వచ్చినట్లు ‘ది సన్’ వెబ్సైట్ వెల్లడించింది.
ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ఆ విమానం పైలట్ అహ్మద్ షా కావాలనే 40వేల అడుగుల ఎత్తులోకి తీసుకెళ్లాడని, ఆ తర్వాత క్యాబిన్లో ఆక్సిజన్ తగ్గించి ప్రయాణికులను హత్య చేశాడని నిపుణులు తెలిపారు. ఆ తర్వాత ఒక్కసారిగా విమానాన్ని సముద్రంలోకి పోనిచ్చాడన్నారు. అయితే, ఇదంతా చేయడానికి ముందు అతడు తన కోపైలట్ను హత్య చేసి ఉండొచ్చని లేదా క్యాబిన్లో పరిస్థితి చూసిరావాలని చెప్పి కాక్పీట్ తలుపు బిగించి ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటాడని తెలిపారు.
ఆక్సిజన్ తీసేయడం వల్ల ప్రయాణికులు స్పృహ కోల్పోయారని, ఆ తర్వాత ఊపిరాడక చనిపోయారన్నారు. కనీసం తమ బంధువులకు కూడా సమాచారం ఇవ్వలేకపోయారని టీమ్ తెలిపారు. ప్రమాదానికి ముందు విమానం బీజింగ్ వైపు కాకుండా ఒక్కసారిగా గాల్లో 40 వేల ఎత్తుకు ఎగిరి అక్కడి నుంచి ‘యు’ టర్న్ తీసుకుంది.
ఆ తర్వాత ఎక్కడ కూలిందనేది స్పష్టత లేదు. అయితే, ఇటీవల ఆ విమానానికి సంబంధించిన శకలాలు దొరికినట్లు సమాచారం వచ్చినా ఖచ్చితంగా ఆ విమానం ఎక్కడ కూలిందో తెలుసుకోలేకపోవడం గమనార్హం. విమానం బ్లాక్ బాక్స్ లభించేవరకు విమానంలో ఏం జరిగిందనేది తెలుసుకోవడం కష్టమే.