ట్రిపుల్ ఆర్ మూవీ నుండి ఎలాంటి అప్డేట్స్ లేక ఫ్యాన్స్ పూర్తిగా డ్రై అయిపోయారు. ఈ విషయం ఆర్.ఆర్.ఆర్ టీమ్ కి కూడా బాగా తెలుసు. దీంతో.., అప్డేట్ ఇవ్వడానికి సరైన టైమ్ కోసం వెయిట్ చేస్తూ వచ్చిన జక్కన్న.. ఈ మంగళవారం ఫ్యాన్స్ కోసం ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. యన్టీఆర్, రామ్ చరణ్ బైక్ పై వెళ్తున్న ఈ పోస్టర్ ఫాన్స్ ని తెగ ఖుషీ చేపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.
సరిగ్గా ఈ సమయంలోనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ పోస్టర్ పై తమ క్రియేటివిటీని చూపించారు. ట్రిపుల్ ఆర్ టీమ్ విడుదల చేసిన పోస్టర్ లో హీరోలు ఇద్దరికీ హెల్మెంట్స్ లేవు. కానీ.., పోలీసులు మాత్రం ఈ పోస్టర్ లో హీరోలు ఇద్దరికీ ఫోటో షాప్ ద్వారా హెల్మెంట్స్ యాడ్ చేసి కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. బైకుపై వెళ్లే సమయంలో ఇద్దరు తప్పక హెల్మెట్ పెట్టుకోవాలని ప్రజల్లో అవగాహన పెంచడానికి పోలీసులు ఈ ప్రయత్నం చేశారు. దీంతో.., ఈ పిక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల క్రియేటివిటీని నెటిజన్స్ సైతం మెచ్చుకుంటుండటం విశేషం. ఇక ఈ పోస్టర్ పై ట్రిపుల్ ఆర్ టీమ్ కూడా స్పందించింది. మీరు పెట్టిన కాప్షన్ పర్ఫెక్ట్గా లేదు. బండికి నంబర్ ప్లేట్ మిస్సయింది అంటూ సరదాగా ట్రిపుల్ ఆర్ టీమ్ రిప్లై ఇచ్చింది. ఏదేమైనా ఓ మంచి పని కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రిపుల్ ఆర్ పోస్టర్ ని ఇలా వాడుకోవడం అందరిని ఆకట్టుకుంది. మరి.. ట్రిపుల్ ఆర్ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రిలీజ్ చేసిన పోస్టర్ లలో మీకు బాగా ఏ పోస్టర్ నచ్చింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.