బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే అంటే సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నషా మూవీతో మంచి పేరు సంపాందిచుకుంది. ఈ భామ పలు వివాదాలతో నిత్యం వార్తలో నిలిచిన సంగతి తెలిసిందే. వ్యాపార వేత్త శ్యామ్ బాంబే ను ప్రేమించి పెళ్లి చేసుకుంది పూనమ్. పెళ్లైన నెలరోజులు గడవకు ముందే భర్తపై అత్యాచారా కేసు పెట్టి జైలుకు పంపింది. తాజా ఓ షోలో ఈ భామ తన వివాహ జీవితంలో తాను పడిన బాధలను, కష్టాల గురించి వివరించింది. తన భర్త ఎంత హింసించాడో ఇటీవల షేర్ చేసుకున్న పూనమ్.. మరోసారి షో ద్వారా ఆ నరకాన్ని వివరించింది.
అసలు సంగతి ఏంటంటే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సరికొత్త షో “లాకప్”. ఈ షో ను ఏక్తాకపూర్ నిర్మిస్తున్నారు. ఇటీవల పూనమ్ కంటెస్టెంట్ గా ఈ షోకి వెళ్లారు. ఇక ఈ షోలో పూనమ్ తన కాపురంలో తాను పడిన కష్టాలను ఏకరవు పెట్టింది. ఈ షో లో మాట్లాడుతూ..” ఇక్కడ నాకు అన్ని దొరుకుతున్నాయి.. మంచి ఆహారం, బెడ్ , నిద్ర, లభిస్తుంది. కానీ శ్యామ్ తో ఉన్నప్పుడు ఆ ఇల్లు నరకంలా అనిపించేంది. అక్కడ కంటి నిండా నిద్రలేదు.. రోజూ తిట్టడం..కుక్కను కొట్టినట్లు కొట్టడం.. రూమ్ లో బంధించడం చేసే వాడు.
ఇది రోజూ జరుగుతూ ఉండేది. కొన్ని సందర్భాల్లో వడాపావ్ అయినా దొరికితే చాలు అనుకునేదాన్ని. నా విషయం ఎవికైనా ఫోన్ చేసి చెప్పాలంటే ఫోన్ ని అందుబాటులో ఉంచే వాడు కాదు. ఆ సమయంలో అతను పెట్టి టార్చర్ భరించలేక చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను” అని తన వేదనను వ్యక్తపరిచింది. మరి.. పూనమ్ పాండే చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.