కొత్త సినిమాని రూ.1 టికెట్ తో చూసే ఛాన్స్ వస్తే మీరేం చేస్తారు? ఎగిరి గంతేస్తారు కదా.. ఈ మూవీ టీమ్ వాళ్లు ఇప్పుడు ప్రేక్షకులకు కోసం అలాంటి ఆఫర్ ప్రకటించారు. కాకపోతే ఓ కండీషన్ పెట్టారు. ఇంతకీ ఏంటది?
మీరు ఈ మధ్య కాలంలో ఏ సినిమా చూశారు? ‘విరూపాక్ష’ లేదా ‘2018’ మూవీని థియేటర్ కి వెళ్లి చూశారనుకుందాం. ఎంత పెట్టి టికెట్ కొన్నారని అడిగితే.. ఎంత లేదన్నాసరే రూ.100, రూ.200 అయినా ఖర్చు పెట్టామని చెబుతారు. దాదాపు ఏ చిత్రమైనా సరే ప్రస్తుతం థియేటర్లలో చూడాలంటే ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కూడా. ఒకవేళ మీకు రూ.1కే కొత్త మూవీ చూసే ఛాన్స్ వస్తే? ఫస్ట్ నిజమా కాదా అని చెక్ చేసుకుంటారు. ఒకవేళ నిజమైతే లేటు చేయకుండా టికెట్ బుక్ చేసుకుంటారు. ఇప్పుడు మీలాంటి ఆడియెన్స్ కోసమే అన్నట్లు ఓ మూవీ టీమ్.. బంపర్ ఆఫర్ ఇచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్య సినిమాకు భాషా బేధం చెరిగిపోయింది. ఇది అది అని తేడా లేకుండా బాగుంది అనుకున్న ప్రతి మూవీని అందరూ చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరోవైపు ఈ ఓటీటీ యుగంలో రీమేక్స్ కూడా ఆగడం లేదు. తెలుగులో ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు రీమేక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సరే ఇది పక్కనబెడితే అడివి శేష్ హీరోగా నటించిన ‘ఎవరు’ని కన్నడలో ‘యాదా యాదా హి’ పేరుతో తీశారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ వశిష్ట సింహా ఇందులో కీలక పాత్ర చేశాడు. హరిప్రియ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ టీమ్ ఇప్పుడు రూ.1 ఆఫర్ అనౌన్స్ చేశారు.
వీళ్లు చెప్పిన దాని ప్రకారం మే 31న అంటే బుధారం సాయంత్రం ‘యాదా యాదా హి’ ప్రీమియర్ షోలు బెంగళూరులోని వీరేష్ సినిమాస్, హుబ్బళ్లిలోని సుధా సినిమాస్ థియేటర్లలోనే కేవలం రూ.1 కే ప్రదర్శించనున్నారు. కన్నడ ఇండస్ట్రీలో ఇలాంటి భిన్నమైన ప్రయత్నం జరగడం ఇదే తొలిసారి. ఈ సినిమాను హైదరాబాద్ కు చెందిన రాజేష్ అగర్వాల్ నిర్మించగా, తెలుగు మూలాలున్న అశోక తేజ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ముందు జస్ట్ ఫ్రెండ్స్ అయిన వశిష్ట, హరిప్రియ.. ఇప్పుడు రిలీజ్ టైంకి పెళ్లి చేసుకుని భార్యభర్త అయిపోయారు. అందుకే వీళ్లిద్దరికీ ఈ సినిమా చాలా స్పెషల్. మరి రూ.1కే మూవీ టికెట్ ఆఫర్ పెట్టడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.