ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కలెక్షన్ల పరంగానే కాదు. అయితే సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఓ టాలెంటెడ్ సింగర్ పేరు వైరల్ గా మారింది. సినిమాలోని ‘కొమ్మా ఉయ్యాల’ పాట ఫేమస్ అవ్వటంతో ఆ పాట పాడింది ఎవరా అని నెటిజన్లు సెర్చ్ చేయటం మొదలుపెట్టారు. దీంతో ఆ పాట పాడిన పకృతి రెడ్డి నెట్టింట వైరల్ పర్సన్గా మారింది. పకృతి రెడ్డిది కర్ణాటకలోని బళ్లారి. తను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అద్భుతంగా పాటలు పాడుతుంది. పలు తెలుగు టీవీ షోలలో కూడా పకృతి పాల్గొంది. సింగింగ్ రియాల్టీ షో ‘తారే జమీన్ పర్’లో పాల్గొని తన గాత్రంతో శంకర్ మహదేవన్ని సైతం మెప్పించింది. అప్పటివరకు రాని ఫేమ్.. ఆర్ఆర్ఆర్ పుణ్యమా అని ఒక్క రోజులో వచ్చేసింది. పకృతి పాటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.